రాహుల్ మరో కాంట్రవర్సీ .. యోగా డే సందర్భంగా వివాదాస్పద ట్వీట్
న్యూఢిల్లీ : ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా నేతలంతా యోగ చేస్తుంటే .. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ యోగా చేస్తే రాజయోగం పట్టేందని బాబా రాందేవ్ బాబా వ్యాఖ్యనించిన నేపథ్యంలో యోగాను పోలుస్తూ ట్వీట్ చేశారు.
ఏం జరిగిందంటే ..?
యోగ డే సందర్భంగా భారత సైన్యం, యోగా డేకు సంబంధించిన ఫోటో, కుక్కల ఫోటోలను రాహుల్ ట్వీట్ చేశారు. యోగా డే అంటే ఏం లేదు .. సైనికులు సరిహద్దుల్లో పోరాడాతారనే అర్ధం వచ్చేలా పోస్ట్ చేశారు. ఇండియన్ ఆర్మీ, వారి కుక్కలు చేసే యోగా ఫోటోల క్యాప్షన్ కూడా ఇచ్చారు రాహుల్. ఇది నవభారతం, సైనికులు నరేంద్ర మోడీ ప్రభుత్వం కోసం త్యాగం చేశారని కొనియాడారు. అయితే రాహుల్ పోస్ట్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాకపోవడంతో రాహుల్ ఆలోచన మందగించిందని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా రాహుల్ గాంధీ ఆలోచన సరళిని మార్చలేదని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విమర్శించారు. భారత సైన్యాన్ని, కుక్కలకు సంబంధించిన విభాగాన్ని రాహుల్ గాంధీ విమర్శించారని మండిపడ్డారు.

దూరం .. దూరం ...
లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ ఆ పార్టీ నేతలను కూడా కలువడం లేదు. అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు. అయితే రాజీనామాను హైకమాండ్ ఆమోదించకపోవడంతో గుర్రుమీదున్నారు. కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యేవరకు తాను కాంగ్రెస్ చీఫ్ పదవీ చేపడుతానని హామీనిచ్చారు. అప్పటినుంచి రాజకీయాలకు సంబంధించి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications