శశికళ నటరాజన్ దిమ్మతిరిగింది: రూ. 380 కోట్ల బినామీ ఎస్టేట్ సీజ్, చివరిగా చిన్నమ్మ!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాణస్నేహితురాలి ముసుగులో చిన్నమ్మ శశికళ వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారని ఆదాయపన్ను శాఖ అధికారులు అనుమానం వక్తం చేస్తున్నారు. తాజాగా శశికళ నటరాజన్ బినామీ ఆస్తులపై నిఘా వేసిన ఐటీ శాఖ అధికారులు రూ. 380 కోట్లకు పైగా విలువైన ఎస్టేట్ సీజ్ చేశారని తెలిసింది. శశికళ బినామీ కంపెనీ పేరుతో రూ. 380 కోట్లకు పైగా విలువైన ఎస్టేట్ సీజ్ చేసిన అధికారులు పలుకోణాల్లో విచారణ చేస్తున్నారని తెలిసింది.

బినామీ ఆస్లులు
గత సంవత్సరం నవంబర్ నెలలో శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులను లక్షంగా చేసుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు చెన్నై, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో 187 చోట్ల దాడులు చేసి అక్రమాస్తుల వివరాలు సేకరించారు.

రూ. 4 వేల కోట్ల ఆస్తులు
శశికళకు కుటుంబ సభ్యులకు చెందిన ఆదాయానికి మించిన రూ. 4 వేల కోట్లకుపైగా అక్రమాస్తులు గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు వాటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అన్ని ఆస్తులు శశికళ కుటుంబ సభ్యులకు ఎలా వచ్చాయి ? అంటూ ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

చెన్నైలో బినామీ కంపెనీ
చెన్నై నగరంలోని ఎంఆర్ సీ నగర్ లో ఆది ఎంటర్ ప్రైజస్ అనే పేరుతో ఉన్న శశికళ బినామీ కంపెనీని ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఆది ఎంటర్ ప్రైజస్ పేరుతో చెన్నై శివార్లలో రూ. 380 కోట్లకు పైగా విలువ చేసే 4.3 ఎకరాల ఎస్టేట్ ఉందని అధికారులు గుర్తించారు.

రూ. 380 కోట్ల ఎస్టేట్ సీజ్ !
శశికళ బినామీ కంపెనీగా భావిస్తున్న ఆది ఎంటర్ ప్రేజస్ కు చెందిన ఎస్టేట్ విషయంలో విచారణ చేసిన అధికారులు సరైన సమాధానం రాకపోవడంతో దానిని సీజ్ చేశారని తెలిసింది. ఆది ఎంటర్ ప్రేజస్ నిర్వహకులను ఐటీ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు.

శశికళ సమాధానం
శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల వివరాలు పూర్తిగా సేకరించిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఇప్పటికే వేర్వేరుగా వారికి సమన్లు జారీ చేసి విచారణ చేసి వివరాలు రాబట్టారు. ఇక చివరిగా శశికళను విచారణ చేసి పూర్తి వివరాలు సేకరించాలని ఐటీ శాఖ అధికారులు నిర్ణయించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications