సరిహద్దులో మళ్లీ అలజడి: చైనాతో 12వ రౌండ్ సైనిక చర్చలు -విజయ్ దివత్ తర్వాతేనన్న భారత్
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. గతంలో తూర్పు లదాక్, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కవ్వింపులకు పాల్పడిన చైనా.. తాజాగా ఉత్తరాఖండ్ సరిహద్దులో దూకుడు పెంచింది. పరిస్థితి మరింత జఠిలంగా మారకముందే, చర్చల ద్వారా డ్రాగన్ ను నిలువరించాలని భారత్ డిసైడైంది. ఈ క్రమంలో..
భారత్, చైనా మధ్య సైనిక చర్చలు మళ్లీ గాడినపడ్డాయి. సరిహద్దులో శాంతి పునరుద్ధరణ, సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియపై చివరిసారిగా ఏప్రిల్ నెలలో రెండు దేశాల సైన్యాధికారులు చర్చలు జరిపారు. దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లోసారి చర్చలకు ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే, ఈ 12వ రౌండ్ చర్చల తేదీపై స్వల్ప మథనం జరిగింది..

సరిహద్దు స్థితిగతులపై, సైనిక ఉపసంహరణపై 12వ రౌండ్ చర్చలను ఈనెల 26వ తేదీనే నిర్వహించుదామని చైనా సైనిక అధికారులు ప్రతిపాదించారని, అయితే, కార్గిల్ యుద్దంలో గెలుపునకు గుర్తుగా భారత్ నిర్వహించే విజయ్ దివస్ కూడా అదే తేదీ కావడం, ఆ రోజు సైన్యం వేడుకల్లో పాల్గొనాల్సిన దరిమిలా మరొక తేదీలో చర్చలు చేద్దామని భారత అధికారులు సూచించారని విశ్వసనీయంగా తెలిసింది. 12వ రౌండ్ చర్చలకు సంబంధించి కొత్త తేదీల ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా,
ఉత్తరాఖండ్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా దూకుడు పెంచింది. బరాహోతి సమీపంలో దాదాపు 40 మంది చైనా జవాన్లు గస్తీ చేపట్టారు. సుమారు 6 నెలల తర్వాత చైనా తన సరిహద్దు భూభాగంలో పెట్రోలింగ్ను ముమ్మరం చేసినట్టు భారత అధికారులు ధ్రువీకరించారు. తాజా పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నామని, ఎలాంటి సవాలునైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications