India: భారత పోర్టుల నుంచి ఇరాన్ పై అమెరికా దాడులు? తేల్చేసిన కేంద్రం..!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel)సంయుక్త దాడుల్ని ఆరంభించి ఆరు రోజులవుతోంది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ సహా మొత్తం టాప్ నాయకత్వాన్ని తుడిచిపెట్టేశామని చెప్పుకున్న అమెరికా-ఇజ్రాయెల్ .. ఇప్పుడు ఈ వార్ ఎన్ని రోజులు కొనసాగుతుంందో చెప్పలేని పరిస్ధితికి వచ్చేశాయి. మరోవైపు ఇరు దేశాల ఆయుధాగారాలు నిండుకోవడం ప్రారంభించాయి. అదే సమయంలో ఇరాన్ వార్ ను సాధ్యమైనంత త్వరగా ముగించేందుకు చుట్టుపక్కల దేశాల సాయాన్ని ఇవి తీసుకుంటున్నాయి.
ఇదే క్రమంలో భారత్ (india)లోని పోర్టుల నుంచి కూడా అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తోందంటూ యూఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మెక్ గ్రెగర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందులో ఆయన.. మా బేస్ లు, పోర్టులన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో మేం భారత పోర్టులపై నుంచి ఇరాన్ పై దాడులు చేయాల్సి వస్తోందన్నారు. ఇది సరికాదన్నారు. నేవీ చెప్పేదీ అదే అన్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అమెరికన్ ఆర్మీ మాజీ కల్నల్ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.

Fake News Alert!
— MEA FactCheck (@MEAFactCheck) March 4, 2026
Claims being made on OAN, a US based channel that Indian ports are being used by the US Navy are fake and false. We caution you against such baseless and fabricated comments. pic.twitter.com/xiFWnkoXBk
అసలే నిన్న భారత్ నుంచి తిరిగి వెళ్తున్న ఇరాన్ నౌకను శ్రీలంక సమీపంలో అమెరికా జలాంతర్గామి దాడి చేసి ముంచేసింది. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత పోర్టుల్ని ఇరాన్ పై దాడులకు అమెరికా వాడుతుందన్న వాదన మరింత బలపడింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ దీనిపై వివరణ ఇచ్చింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమని తేల్చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check)లో వీటికి కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి ఆరోపణలపై అప్రమత్తంగా ఉండాలని అందరినీ కోరింది. మధ్యప్రాచ్యంలో సంఘర్షణపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను పెంచకుండా ఉండాలని, పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.
-
ఇరాన్ వార్ ఎఫెక్ట్- ట్రంప్ ప్రభుత్వంలో తొలి వికెట్..! -
ఇరాన్ వార్ వ్యతిరేకించిన అధికారికి ట్రంప్ షాక్..! వైట్ హౌస్ కీలక నిర్ణయం..! -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
" ఆ 22 భారత్ నౌకలు సేఫ్.. హార్మూజ్ వద్ద.." -
తన గొయ్యి తానే తీసుకుంటున్న ట్రంప్..?? -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..! -
హార్ముజ్ నుంచి 2 నౌకలు తెచ్చిన ఎల్పీజీ 2 రోజులు కూడా సరిపోదా ? -
అలా బతికిపోయిన మొజ్తబా ఖమేనీ..! బాంబు దాడిపై షాకింగ్ ఆడియో లీక్..! -
Ali Larijani: ఇరాన్ వార్ లో బిగ్ టర్న్-ఎవరీ లారిజానీ ? ఎందుకంత కీలకం ? -
ఎంబసీకి చెప్పకుండా ఆ పని చెయ్యొద్దు: ఇరాన్ లోని భారతీయులకు హై అలెర్ట్! -
వేసవిలో ఎక్కువగా ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!














Click it and Unblock the Notifications