బ్రిటన్ రాణి మరణంతో భారత్ లోనూ విషాదం-ఎల్లుండి జాతీయ సంతాపదినంగా ప్రకటన
బ్రిటన్ ను సుదీర్ఘకాలం పాలించిన రాణి ఎలిజబెత్ మరణంతో బ్రిటన్ సహా పలు యూరప్ , ఆసియా దేశాల్లోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించిన ఎలిజబెత్ మృతికి సంతాపంగా బ్రిటన్ లో వారం రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు. ఇదే కోవలో పలు కామన్వెల్త్ దేశాలు కూడా జాతీయ సంతాప దినాల్ని పాటిస్తున్నాయి. దీంతో భారత్ కూడా ఎల్లుండి జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.
బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II మరణించిన నేపథ్యంలో సెప్టెంబర్ 11న భారతదేశం అంతటా ఒకరోజు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

మరోవైపు రాణి మృతితో బ్రిటన్ వ్యాప్తంగా విషాధ ఛాయలు అలుముకున్నాయి. ప్రజలు భారీ ఎత్తున ఆమె మృతదేహం ఉన్న బల్మోరల్ క్యాజిల్ కు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు బ్రిటన్ రాజకుటుంబం అంతా క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల తర్వాత ఏడవ రోజు వరకూ సంతాప కాలాన్ని పాటిస్తారు. రాజ నివాసాల వద్ద జెండాలు సగం మాస్ట్లో ఉంటాయి.రాణి అంత్యక్రియల తర్వాత ఏడు రోజుల వరకు రాజకుటుంబ సంతాప దినాలను పాటించాలని ప్రిన్స్ ఛార్లెస్ కోరిక అని బకింగ్ హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
LPG Refill Booking: గ్యాస్ బుకింగ్స్ పై పుకార్లు నమొద్దు-కేంద్రం క్లారిటీ..! -
Fuel Stock: భారత్ లో చమురు స్టాక్ ఇదే..! తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం..! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications