స్వీడన్ టెక్ స్పేస్లో అగ్ర తాంబూలం భారత సాప్ట్వేర్ ఇంజనీర్లకే
న్యూఢిల్లీ: భారత సాప్ట్వేర్ ఇంజనీర్లు స్వీడన్ టెక్నాలజీ రంగంలో తమదైన ముద్రవేస్తున్నారు. దీంతో భారత సాప్ట్వేర్ ఇంజనీర్లకు మరింత ప్రోత్సాహాం ఇవ్వాలని ఆ దేశం నిర్ణయించింది. మెరుగైన పనితీరు, వినియోగదారులను సంతృప్తిపరచడంలో భారత సాఫ్ట్వేర్ ఇంజినీర్లే ముందున్నారని స్టాక్హోం బిజినెస్ రీజియన్ సీఈవో ఒలోఫ్ జెటెర్బర్గ్ తెలిపారు.
భారతీయ సాప్ట్వేర్ ఇంజనీర్లకు మంచి పేరుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వినియోగదారులను సంతృప్తిపరచడంలో ఇతర కంపెనీలతో పోలిస్తే భారతీయ కంపెనీలు ముందున్నాయి అని స్టాక్హోం బిజినెస్ రీజియన్ మేనేజర్ బెంట్సన్ తెలిపారు.

2009-13 మధ్యకాలంలో 9366 మంది భారత పౌరులకు స్వీడన్ ప్రభుత్వం వర్క్పర్మిట్లు జారీచేసింది. అందులో 8803 మంది ఐటీ నిపుణులే ఉండటం గమనార్హం. స్వీడన్కు వచ్చే వారి విదేశీయుల్లో మొదటి స్దానంలో యూరోపియన్ యూనియన్కి చెందిన వారుంటే ఆ తర్వాత స్దానంలో భారత పౌరులున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం స్టాక్హోం సాంకేతిక రంగంలో సుమారు లక్షా ఇరవై ఐదు వేల మంది పనిచేస్తున్నారు. వీరంతా మొబైల్ సిస్టమ్స్, యాప్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్, ట్రేడింగ్ సాప్ట్వేర్లపై పనిచేస్తున్నారని తెలిపారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications