విమాన ప్రమాదంలో మరణించిన భారతీయురాలి ఫ్యామిలీకి రూ.317 కోట్ల పరిహారం
బోయింగ్ విమాన ప్రమాద ఘటనలో మరణించిన ఒక భారతీయ కుటుంబానికి 317 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2019లో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 మాక్స్ విమానం ప్రమాదానికి గురికాగా ఈ ప్రమాదంలో భారతీయ పౌరురాలు అయిన శిఖా గార్గ్ మరణించారు.
బోయింగ్ విమాన ప్రమాదంలో మరణించిన శిఖా గార్గ్
ఐక్యరాజ్యసమితిలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్న శిఖ గార్గ్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సులో పాల్గొనేందుకు నైరోబి కి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇథియోపియా లోని బోలే అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొన్ని నిమిషాలకే ఆ విమానం కుప్ప కూలిపోవడంతో ఈ ప్రమాదంలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటన లోనే శిఖ గార్గ్ కూడా మరణించారు.

కోర్టులో బోయింగ్ విమాన కంపెనీపై దావా వేసిన శిఖా గార్గ్ కుటుంబం
ఆ తర్వాత బోయింగ్ ఈ కేసులలో చాలా వరకు పరిహారం అందించి పరిష్కరించింది. అయితే శిఖ గార్గ్ ఐక్యరాజ్యసమితిలో కన్సల్టెంట్ గా పనిచేయడం, ఆ విమాన ప్రమాదం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోవడం తదితర అంశాలతో పాటు, విమాన డిజైన్ లో లోపాలు ఉన్నాయని, ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడం లో బోయింగ్ విఫలమైందని ఆరోపిస్తూ శిఖ గార్గ్ కుటుంబం కోర్టులో దావా వేసింది.
శిఖా కుటుంబానికి అనుకూలంగా తీర్పు
ఈ క్రమంలోనే చికాగోలోని ఫెడరల్ జ్యూరీ ఈ వారంలో శిఖ కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. పరిహారంతో పాటు ఇప్పటివరకు ఆయన ఖర్చులను కూడా కలిపి ఇవ్వాలని 35.85 మిలియన్ డాలర్లను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆరేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత శిఖ కుటుంబానికి ఈ విజయం లభించింది.
తాజా తీర్పుతో శిఖా గార్గ్ ఫ్యామిలీకి రిలీఫ్
భారతీయ సాంప్రదాయాలను ఎక్కువగా ఇష్టపడే శిఖ గార్గ్ ఐక్యరాజ్యసమితి కన్సల్టెంట్ గా పనిచేయడంతో పాటు ఆమె మరణించిన సమయంలో పీహెచ్డీ కూడా చేస్తున్నారు. చీర కట్టుకునే ఎక్కువగా ఇష్టపడే శిఖ గార్గ్ ప్రమాదం జరిగిన రోజు చీరకట్టులోనే విమానాన్ని ఎక్కారని, ఆ తర్వాత తిరిగిరాని లోకాలకు చేరిపోయారని వారి కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా తీర్పు ఆమె కుటుంబానికి కాస్త ఉపశమనం అని చెప్పాలి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications