రైలు ప్రయాణానికి ప్రింటెడ్ టికెట్ అవసరమా?- రైల్వే శాఖ క్లారిటీ
ప్రయాణ సమయంలో అన్రిజర్వ్డ్ రైలు టికెట్లకు సంబంధించిన ప్రింటెడ్ కాపీలను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందంటూ వస్తోన్న వార్తలపై రైల్వే శాఖ స్పందించింది. అటువంటి నిబంధన ఏదీ లేదని స్పష్టం చేసింది. టికెటింగ్ నిబంధనల్లో మార్పులు వచ్చాయని వస్తున్న మీడియా నివేదికలు తప్పుదోవ పట్టించేవని స్పష్టం చేసింది. ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, అవన్నీ కూడా నిరాధారమైనవని పేర్కొంది.
ఇప్పటికే ఉన్న నిబంధనల మేరకు, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో బుక్ చేసినా ప్రింటవుట్ తీసుకుంటే ప్రయాణికులు వాటిని తమ వెంట ఉంచుకోవాలి. డిజిటల్గా బుక్ చేసుకుని ప్రింట్ తీసుకోని వారు మాత్రం బుకింగ్ కోసం వాడిన మొబైల్ నుంచే టికెట్ను తనిఖీకి చూపించవచ్చు. ఈ విషయంలో ఎలాంటి కొత్త ఆదేశాలు లేవని రైల్వే శాఖ పేర్కొంది. రిజర్వేషన్ లేని రైలు టిక్కెట్లకు ప్రింటెడ్ కాపీ తప్పనిసరి కాదని వివరణ ఇచ్చింది.

డిజిటల్, రిజర్వేషన్ లేని అన్ని టిక్కెట్లకు హార్డ్ కాపీలు అవసరమంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో రైల్వే శాఖ ఈ వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించినంత వరకు రైల్వేలు ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదని, రిజర్వేషన్ లేని టిక్కెట్లతో ప్రయాణించే పాత విధానం అమల్లో ఉందని, ప్రయాణికులు ప్రస్తుతం ఉన్న నిబంధనలను మాత్రమే పాటించాలని పునరుద్ఘాటించింది. ఆన్లైన్లో బుక్ చేసిన డిజిటల్ అన్ రిజర్వుడ్ టిక్కెట్లకు ప్రింటవుట్ అవసరం లేదు. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లోనే టిక్కెట్ను చూపవచ్చు.
ఈ వివరణ- రోజువారీ/ స్వల్ప దూర ప్రయాణికులు, ప్రత్యేకించి డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా తరచుగా టిక్కెట్లు తీసుకునే వారికి ఉపశమనం కలిగించినట్టయింది. అనవసర గందరగోళాన్ని నివారించడానికి- అధికారిక నోటిఫికేషన్లు, ధృవీకరించిన సమాచారంపై మాత్రమే ఆధారపడాలని రైల్వేలు ప్రయాణికులకు సూచించాయి. ఈ ప్రకటనతో అన్ని ఊహాగానాలకు రైల్వే శాఖ తెరదించింది. రిజర్వేషన్ లేని ప్రయాణానికి ప్రస్తుత ధృవీకరణ నిబంధనలను కొనసాగుతుందని వివరించింది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications