మే 23.. కౌంటింగ్ డే టార్గెట్.. భారీ ఉగ్రదాడికి స్కెచ్
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఆరు దశల పోలింగ్ ఇప్పటికే పూర్తయింది. ఏడవ విడత మాత్రమే మిగిలింది. ఇక మే 23వ తేదీన ఫలితాలు రానున్నాయి. కేంద్రంలో అధికారంలోకి ఎవరు రానున్నారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో టెర్రరిస్టులు భారీ ఉగ్రదాడికి స్కెచ్ వేసినట్లు బయటపడటం భయాందోళన రేకెత్తిస్తోంది.
మే 23వ తేదీ టార్గెట్గా అదను చూసి ఉగ్రదాడితో విరుచుకుపడాలని టెర్రరిస్టులు భారీ స్కెచ్ వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. గురువారం షోపియాన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. అందులో ఒకడి జేబులో నుంచి ఉగ్రదాడికి సంబంధించిన మ్యాప్ను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి.

అవంతిపురా, శ్రీనగర్ ఎయిర్ బేస్ క్యాంపులపై దాడి జరిపేలా ఆ స్కెచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్ట్ సంస్థలు ఈ దాడులకు ప్రణాళిక వేసినట్లు సమాచారం. ఈ రెండు క్యాంపులే టార్గెట్గా కౌంటింగ్ రోజు బీభత్సం సృష్టించాలనేది వారి ప్లాన్గా అర్థమవుతోంది.
మే 23 కౌంటింగ్ రోజుకు సరిగ్గా రంజాన్ మాసంలో 17వ రోజు రానుంది. ఆ రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకుని కలకలం సృష్టించాలనేది వారి స్కెచ్ గా అనుమానిస్తున్నాయి భద్రతా దళాలు. దీనికోసం ఈనెల 14వ తేదీన పుల్వామా ప్రాంతంలో ఉగ్ర కమాండర్ల భేటీలో ఈ దాడులకు సంబంధించిన ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications