ములాయంపై అమితాబ్ న్యాయపోరాటం
లక్నో: సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి అమితాబ్ థాకూర్ సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ పై న్యాయపోరాటం చేస్తున్నారు. తన మీద కక్షసాధిస్తు బెదిరిస్తున్న ములాయం సింగ్ యాదవ్ మీద చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.
ఫిర్యాదు స్వీకరించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సోమప్రభ మిశ్రా విచారణ చేసి నివేదిక సమర్పించాలని హజ్రత్ గంజ్ పోలీసులకు ఆదేశించారు. కేసు తుదుపరి విచారణ ఆగస్టు 4వ తేదికి వాయిదా వేస్తున్నామని న్యాయమూర్తి సోమప్రభ మిశ్రా తెలిపారు.
అమితాబ్ థాకూర్ తన న్యాయవాదితో కోర్టులో ఫిర్యాదు చేయించారు. జులై 11వ తేది హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో, జులై 23వ తేది లక్నో లో అమితాబ్ థాకూర్ ములాయం సింగ్ యాదవ్ మీద ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదు.
ములాయం సింగ్ తనను బెదిరించారని ఆరోపిస్తు థాకూర్ మీడియాకు ఆడియో టేపులు విడుదల చేశారు. తరువాత ములాయం సింగ్ మీద కేసు పెట్టడానికి ప్రయత్నించారు. కక్షకట్టిన సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం ఆయన మీద రేప్ కేసు నమోదు చేయించారు. విధులు దుర్వినియోగం చేశారని మూడు రోజులకే థాకూర్ నుసస్పెండ్ చేశారు. థాకూర్, ఆయన బంధువుల ఆస్తుల వివరాలు బయటకు తీస్తున్నారు.