Bengaluru: ఫ్రెండ్స్ తో వన్ వేలో స్కూటర్ నడిపాడు, చివరికి ఏం జరిగింది ?, ట్రాఫిక్ లో !
బెంగళూరు/మెజస్టిక్: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని చాలా రోడ్లలో ట్రాఫిక్ నియంత్ర కోసం పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో బెంగళూరులో విపరీతంగా వన్ వేల్ ఏర్పాటు చేశారు. వాహన సంచారం సవ్యంగా సాగడానికి బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు.
ఎంత చేసినా బెంగళూరులో వన్ వేలో ద్విచక్రవాహనాలను వేగంగా నడుపుతూ డివైడర్లను ఢీకొట్టే యువకుల సంఖ్య పెరుగుతోంది. బెంగళూరులోని మెజెస్టిక్ సమీపంలోని గూడ్స్షెడ్ రోడ్డులో పాదచారుల డివైడర్ను ఢీకొనడంతో మైనర్ అబ్బాయి ధనుష్ (17) తీవ్రంగా గాయపడ్డాడు. ధనుష్ ను వెంటనే చికిత్స నిమిత్తం విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించినా చికిత్స ఫలించక మృతి చెందాడు.

మెజెస్టిక్ నుంచి మంచి వెలుతున్న సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. ధనుష్ తలకు తీవ్ర గాయాలయ్యాయని, వెంటనే అతని స్నేహితులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారని పోలీసులు అన్నారు. విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స విఫలం కావడంతో ధనుష్ మృతి చెందాడని ఉప్పరపేట ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
భోజనం తీసుకురావడానికి స్నేహితులతో కలిసి ధనుష్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ సమయంలో అజాగ్రత్తగా స్కూటర్ నడపడంతో రోడ్డు డివైడర్ను ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో అతను చనిపోయాడని పోలీసులు అంటున్నారు. బైక్ నడపడానికి ధనుష్ కు లైసెన్స్ కూడా లేదని పోలీసులు అన్నారు. లైసెన్స్ లు లేకుండా చాలా మంది యువకులు వాహనాలు నడుపుతున్నారని, అందుకే ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని బెంగళూరు పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications