IT Hub: స్టూడెంట్ లీడర్ కు పగిలిపోయింది. బ్యాన్ చేశారని నకిలి పాస్ పోర్ట్ తో ?
బెంగళూరు: భారతదేశంలో ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని, ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐని నిషేధించిన విషయం తెలిసిందే. దేశద్రోహం పనులు చేస్తున్నారని ఇప్పటికే పలువురు పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీఎఫ్ఐ బ్యాన్ చేసిన తరువాత ఆ సంస్థ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆ రాష్ట్రం వదిలేసి ఐటీ హబ్ చేరుకుని నకిలీ పాస్ పోర్ట్ తో దేశం విడిచిపారిపోవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.
Wife: ప్రియుడు, డ్రగ్స్, మద్యం మోజులో మునిగిపోయిన భార్య, బెస్ట్ ఫ్రెండ్ ను రంగంలోకి దింపిన భర్త !
పీఎఫ్ఐని బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం
భారతదేశంలో ఇటీవల హిందూ కార్యకర్తలను టార్గెట్ చేసుకుని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో హిందూ కార్యకర్తల హత్యలుల కలకలంరేపాయి. భారతదేశంలో ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని, ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐ సంస్థను నిషేధించిన విషయం తెలిసిందే.
పీఎఫ్ఐ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
అసోంలోని గుహవాటిలో నివాసం ఉంటున్న అమీర్ హంఝూ అసోంలో పీఎఫ్ఐ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐని బ్యాన్ చేసిన తరువాత అమీర్ హంఝూ గట్టుచప్పుడు కాకుండా గుహవాటి వదిలేసి బెంగళూరు చేరుకుని హెణ్ణూరు సమీపంలోని సారాయిపాళ్యలో మకాం వేశాడు.
నకిలి పాస్ పోర్టు
బెంగళూరులో మకాం వేసిన అమీర్ హంఝూ నకిలి పాస్ పోర్ట్ ఉపయోగించి ఇక్కడి నుంచి విదేశాలకు పారిపోవాలని ప్రయత్నించాడు, నకిలి ఆధార్ కార్డు, నకిలి గుర్తింపు కార్డులు ఇచ్చిన అమీర్ పాస్ పోర్టు తీసుకోవాలని ప్రయత్నించారు, అమీర్ నకిలి పాస్ పోర్ట్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని బెంగళూరు పోలీసులకు తెలిసిపోయింది.
అసోం పోలీసులు ఎంట్రీ
బెంగళూరు పోలీసులు సమాచారం ఇవ్వడంతో అసోంలోని గుహవాటి పోలీసులు బెంగళూరు చేరుకుని విదేశాలకు పారిపోవాలని ప్రయత్నించిన అమీర్ హంఝూను గురువారం అరెస్టు చేశారు. అమీర హంఝును కోర్టు ముందు హాజరుపరిచి గుహవాటికి అతన్ని పిలుచుకుని వెళ్లాలని అసోం పోలీసులు సిద్దం అయ్యారు.