వైభవోపేతంగా పూరీ జగన్నాథుడి రథయాత్ర: లక్షలాదిగా పాల్గొన్న భక్తులు
భువనేశ్వర్: ప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్ర మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. జగన్నాథుడి రథయాత్రను చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. విదేశాల నుంచి కూడా అనేక మంది పూరీకి చేరుకున్నారు. పూరీ రథయాత్ర జరిగే వీధులన్నీ ఇసుకేస్తే రాలనంతా భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. జై జగన్నాథ్ అంటూ భక్తులు పరవశించిపోయారు. పూరీ వీధులన్నీ జగన్నాథుడి నినాదాలతో మార్మోగుతున్నాయి.
Lo and Behold! Mahaprabhu Jagannath comes out of his abode to meet his beloved devotees. Watch Pahandi of the Lord of the Universe as He is being escorted onto His chariot - Nandighosha #RathYatra #RathYatra2023 #RathaJatra #RathYatraWithOTV #OTVNewsEnglish #Puri #Odisha pic.twitter.com/oYVhU1m45C
— OTV (@otvnews) June 20, 2023
రథాలను భక్తులు జగన్నాథుడి నినాదాలతో లాగారు. ఈ ఊరేగింపునకు నందిఘోష్ (జగన్నాథుడి రథం), తాళధ్వజ (బలభద్రుడిది), దర్పదళన్ (సుభద్ర) రథాలు సిద్ధం చేశారు.కాగా, మంగళవారం ఉదయం జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్టించి తర్వాత మంగళహారతి చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై చెరాపహర(బంగారు చీపురుతో ఊడ్చడం) చేశారు.

ఆ తర్వాత మంగళవారం 3 గంటలకు రథయాత్ర ప్రారంభమైంది. ఈ సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకోనున్నాయి. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు తొమ్మిది రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఆ తర్వాత జూన్ 28న తిరిగి పూరీ మందిరానికి చేరుకుంటారు జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర.
WATCH NOW -
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) June 20, 2023
The auspicious Lord Jagannath’s Rath Yatra from Puri on https://t.co/5M0pxmKZXB#LordJagannath #RathYatra2023 pic.twitter.com/tbKd1TCA6M
కాగా, రథయాత్ర నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఒడిశా ప్రభుత్వం. భక్తులు వచ్చేందుకు వీలుగా 125 ప్రత్యేక రైళ్లను వేసింది. 180 దళాలతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సారి 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చీఫ్ సెక్రటరీ పీకే జెనా తెలిపారు. ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, సుఖ సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.
Jai Jagannath…🙏
— Sudarsan Pattnaik (@sudarsansand) June 20, 2023
On the auspicious occasion of the #RathaYatra, My sand art with installations of 250 coconuts at #Puri beach in Odisha . My daughter Saanvi’s song on #RathaJatra . https://t.co/A5LMMVya8E pic.twitter.com/hYhe4nV2tt
మరోవైపు, జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. మరో అద్భుత శిల్పాన్ని పూరీ సముద్రతీరం వెంబడి తీర్చిదిద్దారు. 250 కొబ్బరికాయలతో 6 అడుగుల ఎత్తైన జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడి విగ్రహాలకు ప్రాణం పోశారు. వాటి వెనుక జగన్నాథ రథాలను ఏర్పాటు చేశారు. చరిత్రలో దాసియా బౌరి అనే భక్కుడు.. స్వామి వారికి కొబ్బరికాయలు సమర్పించుకున్న ఘట్టానికి గుర్తుగా శిల్పాన్ని తీర్చిదిద్దినట్లు సుదర్శన్ తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications