భారత్- పాకిస్థాన్ కాల్పుల విరమణకు కారణం వాళ్లే.. జై శంకర్ సంచలన వ్యాఖ్యలు
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్ లో దాదాపు 200 మందికి పైగా మృతి చెందినట్లు భారత రక్షణశాఖ ఇటీవల పేర్కొంది. మరోవైపు భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తన వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు చెబుతున్నారు. ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు జర్మన్ డైలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ క్రెడిట్ తనదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మండిపడ్డారు. భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు కారణం భారత త్రివిధ దళాలు అని జై శంకర్ తెలిపారు. భారత త్రివిధ దళాల ధాటిని తట్టుకోలేక పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రస్తావన తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఏమీ లేదన్నారు.
భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు ఈ క్రెడిట్ దక్కుతుందని అమెరికాకు కాదని జై శంకర్ తెలిపారు. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికాకు థ్యాంక్స్ చెబుతారా..? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. " కాల్పుల విరమణకు ఇరు దేశాల ప్రతినిధులు డైరెక్ట్ గా మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ముందురోజు పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై భారత్ సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో వారికి తీరని నష్టం వాటిల్లింది. దీంతో ఆ దేశం ఒప్పందానికి వచ్చింది. ఇందులో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే భారత త్రివిధ దళాలకు చెబుతా. వారి పోరాట ప్రతిమ వల్లే పాకిస్థాన్ తల వంచింది" అని విదేశాంగ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు.

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మే 07న ప్రారంభమై మే 11 వరకు జరిగింది. మే 10న భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహన ఏర్పడినా.. మళ్లీ కొద్దిసేపటికే పాక్ తన వక్ర బుద్దిని చాటింది. ఆ రాత్రి మరోసారి డ్రోన్ లతో సరిహద్దు రాష్ట్రాలపై దాడికి పాల్పడింది. కానీ వాటిని భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications