వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి తలనొప్పి: బీహర్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జెడి( యూ) డిమాండ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాట్నా: ప్రధానమంత్రి మోడీకి మరో రాష్ట్రం నుండి ప్రత్యేక హోదా డిమాండ్‌ ముందుకు తీసుకువచ్చింది. బీహర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జెడి(యూ) కూడ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది బీహర్‌లో ప్రధానమంత్రి మోడీ మంగళవారం నాడు పర్యటించనున్నారు.

తమ రాష్ట్రానికి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ప్రకటించాలని జనతాదళ్‌(యునైటెడ్‌) పార్టీ సోమవారం కోరింది. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిహార్‌లోని మోతిహరిలో పర్యటించనున్నారు. చంపారన్‌ సత్యాగ్రహం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు మోదీ అక్కడకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బిహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని జేడీయూ జనరల్‌ సెక్రటరీ షాయం రజాక్‌ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు.

JD-U wants Modi to grant Bihar special status

గత నెలలోనే ఈ విషయం గురించి బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మళ్లీ లేవనెత్తారు. 2005లోనే మొదటి సారి బిహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని నితీష్‌ కోరారు. అప్పటి నుంచి మిన్నకుండిపోయిన నితీష్‌ ఇటీవల ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని వైఎస్సార్సీపీ, టీడీపీలు ఢిల్లీలో పోరాటం చేస్తుండటంతో మళ్లీ ఈ అంశం తెరమీదకు వచ్చింది. నితీష్‌ కుమార్‌ గనక గట్టి నాయకుడైతే బిహార్‌కు ప్రత్యేక హోదా కావాలని మోదీని డిమాండ్‌ చేయాలని గత వారం బిహార్‌ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్‌ వ్యాఖ్యానించారు.

English summary
The Janata Dal-United (JD-U) on Monday said it wanted Prime Minister Narendra Modi to announce granting of special category status to Bihar when he visits the state on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X