వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.11వేల కోట్ల మోసానికి రూ.2కోట్ల బీమానా!: పీఎన్బీకి తప్పని భారీ మూల్యం?

|
Google Oneindia TeluguNews

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌(పీఎన్బీ)లో జరిగిన భారీ కుంభకోణంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా బ్యాంకుల్లో ఉద్యోగుల ద్వారా ఏదైనా మోసం జరిగితే బీమా వచ్చేలా చర్యలు తీసుకుంటాయి. పీఎన్బీ కూడా అదే చేసింది కానీ, అది భారీ మూల్యానికి కావడం గమనార్హం.

Recommended Video

Punjab National Bank Scam : ED Raids Nirav Modi Properties

పీఎన్బీ చేసిన బీమా రూ.2కోట్లు మాత్రమే. అంటే ఇప్పుడు రూ.11వేల కోట్ల మోసానికి కూడా బీమా కింద బ్యాంకుకు వచ్చేది రూ.2కోట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.

 పీఎన్బీ చేసిన తప్పిదం

పీఎన్బీ చేసిన తప్పిదం

కాగా, అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టపరిహార బీమా పాలసీ కింద వాణిజ్య, బిల్ డిస్కౌంటింగ్, సైబర్ బీమా కింద కింద ప్రత్యేకంగా ఈ సదుపాయాన్ని తీసుకున్నాయి. కానీ, పీఎన్బీ మాత్రం అలా చేయలేదు. ఈ బీమాను యూనైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ 40శాతం వరకు ఇస్తోంది. ఇక మిగితా 60శాతం బీమాను మూడు ప్రభుత్వ రంగ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఇస్తున్నాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 11వేల కోట్ల కుంభకోణం: భారీ నష్టాలు, 10మంది ఉద్యోగుల సస్పెన్షన్పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 11వేల కోట్ల కుంభకోణం: భారీ నష్టాలు, 10మంది ఉద్యోగుల సస్పెన్షన్

 11వేల కోట్లకు రూ.2కోట్లు మాత్రమే

11వేల కోట్లకు రూ.2కోట్లు మాత్రమే

ఈ వ్యవహారంలో యూనైటెడ్ ఇండియాకు చెందిన ఓ అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. పీఎన్బీ బ్యాంకర్ నష్ట పరిహార పాలసీ కింద రూ.5కోట్ల ప్రీమియంను చెల్లిస్తోంది. ఈ పాలసీ మొత్తం బీమాను కల్పించదు. ఆస్తి నష్టం, అగ్ని ప్రమాదం, దోపిడీ, మోసాల కింద ఈ బీమా నిర్దిష్ట పరిమితులను మాత్రమే కవర్ చేస్తోంది. అలా పీఎన్బీ ఉద్యోగులు ఏదైనా మోసానికి పాల్పడితే ఆ బ్యాంకుకు వచ్చే బీమా రూ.2కోట్లు మాత్రమేనట.

నీరవ్ మోడీ, చోక్సీకి ఈడీ సమన్లు: 4వారాలపాటు పాస్‌పోర్ట్ సస్పెన్షన్నీరవ్ మోడీ, చోక్సీకి ఈడీ సమన్లు: 4వారాలపాటు పాస్‌పోర్ట్ సస్పెన్షన్

 ఉద్యోగులు మోసపూరితంగా..

ఉద్యోగులు మోసపూరితంగా..

పీఎన్బీలో మోసం 2011 నుంచి జరుగుతోందని వాళ్లే చెబుతున్నారు.. కానీ, పీఎన్బీకి తాము బీమాను రెండేళ్ల నుంచి మాత్రమే అందిస్తున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. ముంబైలోని ఓ పీఎన్బీ బ్రాంచిలో రూ.11,400కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగిన విషయం తెలిసిందే. కొంతమంది ఖాతాదారులకు లబ్ధి చేకూర్చేందుకు తమ సిబ్బంది తప్పుడు ‘లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్(ఎల్ఓయూ)'ల ద్వారా కుట్ర పన్నినట్లు పీఎన్బీ వెల్లడించింది.

 షాకిచ్చిన ఆర్బీఐ..?

షాకిచ్చిన ఆర్బీఐ..?

కాగా, ఎల్ఓయూని చూపించి విదేశాల్లో భారతీయ బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. ఆ విధంగా ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ తదితర 30బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తేలింది. పీఎన్బీ.. మధ్యవర్తిగా ఉండి రుణాలు ఇప్పించిన బ్యాంకులన్నింటికీ రూ.11వేల కోట్ల మొత్తాన్ని పీఎన్బీనే చెల్లించాలని ఆర్బీఐ కూడా ఆదేశించినట్లు సమాచారం. దీంతో పీఎన్బీకి గట్టి షాకే తగిలిందని చెప్పవచ్చు.

English summary
The cost of being under-insured is likely to hit Punjab National Bank (PNB) hard. Currently, the public sector bank has only bought a basic banker’s indemnity policy, which covers employee fraud, to the extent of Rs 2 crore or 0.70% of the total fraud of around Rs 11,300 crore according to highly placed sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X