కరెంట్ చార్జీల పెంపుపై దిమ్మతిరిగిపోయే క్లారిటీ ఇచ్చి డీకే, ఆలస్యం అయినా చేస్తాం !
బెంగళూరు: విద్యుత్ ధరల పెంపును ఖండిస్తూ కర్ణాటక ప్రభుత్వానికి, కేఇబీకి వ్యతిరేకంగా ఇప్పటికే పలు జిల్లాల్లో పరిశ్రమలు, ప్రజా సంఘాలు నిరసనలు చేపట్టాయి. దీనికి సంబంధించి బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ కరెంటు చార్జీలు పెంచింది మేము కాదని, బీజేపీ నాయకులు కరెంట్ చార్జీలు పెంచారని ఆరోపించారు.
బీజేపీ హయాంలో కరెంటు ధరలు పెరిగాయని, ఎన్నికల ఫలితాలు రాకముందే కరెంటు ధరలను పెంచేశారని. ధరల నిర్ణయంలో విద్యుత్ ఛార్జీల సవరణ కమిటీకి సొంత అధికారం ఉందని కూడా డీకే శివకుమార్ చెప్పారు. బీజేపీ ఎన్ని కొత్త బిల్లులు సృష్టించి కట్టిందో చెబితే ఎంత మంది ఇంటికి వెళ్తారో తెలుసా? కొత్త బిల్లులు సృష్టించి వేల కోట్ల రూపాయలను స్వాహా చేశారని ఆ విషయాలు మాజీ సీఎంలు బసవరాజ్ బొమ్మయ్, బీఎస్. యడ్యూరప్పలకు తెలుసని డీకే శివకుమార్ అన్నారు.

కర్ణాటకలో కరెంటు ఖర్చు ఎంత అనేది నాకు తెలుసు, నా హయాంలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు ఇచ్చామని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే విద్యుత్ ఉత్పత్తి చేయకుండానే రూ. 3, 500 కోట్ల విలువైన కరెంటు ఎలా విక్రయించారు? అంటూ బీజేపీ నేతలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రశ్నించారు.
జనవరి నుంచి విద్యుత్తు కార్పొరేషన్ నుంచి ఈ నిబంధనలను అమలు చేయడంతో విద్యుత్ బిల్లు పెరిగింది. దీనిపై ముఖ్యమంత్రి, మంత్రులతో చర్చించి తగిన నిర్ణయానికి వస్తామని డీకే శివకుమార్ అన్నారు. ఇచ్చిన హామీ మేరకు గృహజ్యోతి పథకాన్ని కూడా అమలు చేస్తామన్నారు. అన్నభాగ్య పథకం అమలుపై డీకే శివకుమార్ మాట్లాడుతూ ఆలస్యమైనా అన్నభాగ్య పథకం అమలు చేస్తామని అన్నారు.
ఈ పథకం అమలు కోసం పేదలు, లబ్ధిదారులు పాకులాడటం లేదని, అలా కాకుండా కడుపు నిండా ఉన్న కొందరు నాయకులు సామాన్య ప్రజలను రెచ్చగొడుతున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు. ఈ ప్రభుత్వం మాకు అండగా నిలుస్తోందని పేదలు అంటున్నారు. అలాగే మా శక్తి పథకం ద్వారా ఆర్ టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్న మా అక్కా చెల్లెళ్లు దేవాలయాలకు వెలుతున్నారని, తీర్థయాత్రలు చేస్తున్నారని డీకే శివకుమార్ సంతోషం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications