సావర్కర్ సంతానానికి భయపడేదే లేదు- సిసోడియాపై ఎల్జీ ఆరోపణలకు కేజ్రివాల్ కౌంటర్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మద్యం, అవినీతి మాఫియాల్ని ప్రోత్సహిస్తున్నారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. వీటిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు సిసోడియా చాలా కష్టపడుతున్నారని, దాని వల్ల ప్రశంసలు, ఎన్నికల మద్దతు లభిస్తున్నాయని, అందుకే కేంద్రం వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
సిసోడియా తనకు 22 సంవత్సరాలుగా తెలుసని, ఆయన "హార్డ్ కోర్ నిజాయితీ" వ్యక్తి అని కేజ్రివాల్ వెల్లడించారు.. మనీష్ సిసోడియాపై సీబీఐకి కేసు పెట్టామని, మరికొద్ది రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారని తెలిసిందని, ఇది పూర్తిగా ఫేక్ కేసు అని, ఈ కేసులో అసలు నిజం లేదని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వ వివాదాస్పద కొత్త ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దర్యాప్తు చేయాలని సక్సేనా ఇవాళ సిఫార్సు చేశారు. చీఫ్ సెక్రటరీ నివేదికను ప్రస్తావిస్తూ .. ఎక్సైజ్ శాఖ ఇన్ఛార్జ్ మంత్రి మనీష్ సిసోడియా అవినీతికి పాల్పడ్డారని, ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించే మద్యం వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా పని చేశారని ఆరోపించారు. దీనిపై కేజ్రివాల్ భగ్గుమన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ దర్యాప్తు సూచనను బీజేపీ నేతలు స్వాగతించారు . తాము కూడా మద్యం విధానంపై విచారణకు డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. దీంతో ఈ డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతల్ని "సావర్కర్ పిల్లలు" అని కేజ్రివాల్ అభివర్ణించారు. తమ పార్టీ నాయకులు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పిల్లలని, అతను బ్రిటిష్ వారి ముందు తలవంచడానికి నిరాకరించాడని, దానికి బదులుగా ఉరితీతను ఎంచుకున్నాడని కేజ్రివాల్ తెలిపారు. ఇప్పుడు భగత్ సింగ్ వారసులైన తాము జైలుకెళ్లినా భయం లేదన్నారు. ఢిల్లీ అభివృద్ధి నమూనా కారణంగా ఆప్కి లభించిన ప్రజాదరణ మరియు ఎన్నికల విజయమే కేంద్రాన్ని భయపెట్టిందని, దీని కారణంగా వారు పార్టీపై దాడి చేసి తమ ఎమ్మెల్యేలను జైలుకు పంపుతున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications