Kerala Survey: కేరళలో మారిపోతున్న లెక్కలు-తాజా సర్వేలో ఎడ్జ్ ఎవరికంటే?
కేరళ(kerala)లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో ఓటర్ల నాడి ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో పలు భిన్నమైన ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా హైదరాబాద్ కు చెందిన ఎస్ఏఎస్ సంస్థ కేరళలో ఓటరునాడిని తెలుసుకునేందుకు ప్రయత్నించింది. ఇందులో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి.
ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకూ కేరళలో నిర్వహించిన ప్రీపోల్ సర్వే (kerala survey)ఫలితాల్ని ఎస్ఏఎస్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ఎన్నికల అంశాలుగా ధరల పెరుగుదల, నిరుద్యోగం, డ్రగ్స్, అవినీతి, కాంగ్రెస్ లో కుమ్ములాటలు, క్రిస్టియన్, ముస్లిం ఓటింగ్, ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత, శబరిమల బంగారం చోరీ, మతపరమైన ఏకీకరణ ఉన్నాయి. అలాగే ఎల్టీఎఫ్, యూడీఎఫ్ భవిష్యత్తును నిర్ణయించేది 14 నియోజకవర్గాలుగా తేలింది.

ఈ సర్వేలో సీఎంగా పినరయి విజయన్ కే అత్యధికంగా 30 శాతం మంది మొగ్గు చూపారు. పీసీసీ ఛీఫ్ వీడీ సతీషన్ ను 29శాతం మంది మద్దతు తెలిపారు. బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ కు 12 శాతం ఓటర్ల మద్దతు లభించింది. ఈసారి ఎవరికి ఓటేస్తారని ప్రశ్నిస్తే 39 శాతం ఎల్డీఎఫ్ కు, 37 శాతం యూడీఎఫ్ కు, 16 శాతం బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఎల్టీఎఫ్ కు 39 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు. యూడీఎఫ్ కు 38 శాతం ఓటర్లు మద్దతునిచ్చారు. బీజేపీకి 14 శాతం మంది మద్దతిచ్చారు. మొత్తం 140 సీట్లలో ఎల్టీఎఫ్ కూటమికి 69-73 సీట్లు, యూడీఎఫ్ కు 67-72 సీట్లు, బీజేపీకి 3-4 సీట్లు, ఇతరులకు 1-2 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.












Click it and Unblock the Notifications