పుదుచ్చేరి గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీ తొలగింపు: తమిళిసైకి అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పుదుచ్చేరిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కొనసాగుతున్న కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు అదనపు బాధ్యతలను అప్పగించింది.
ఇది ఇలావుంటే, పుదుచ్చేరిలో నెల రోజుల వ్వవధిలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. దీంతో పార్టీ బలం మెజార్టీ మార్కు దిగువకు చేరడంతో పుదుచ్చేరి ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

ఈ క్రమంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక, ఆ బాధ్యతలను తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ పదవి నుంచి డాక్టర్ కిరణ్ బేడీని తొలగిస్తూ రాష్ట్రపతి ఆదేశించారని, ఆ విధులను నిర్వహించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించారని పెసిడెంట్ సెక్రటరీ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. కిరణ్ బేడీ తన బాధ్యతల నుంచి వైదొలిగిన వెంటనే తమిళిసై ఆ బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications