నాపై చేసిన ఘాటు వ్యాఖ్యలు వినేందుకు: కిరణ్ బేడీ బహిరంగ లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కృష్ణా నగర్ నుండి పోటీ చేసిన మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ సోమవారం నాడు దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అందులో ఆమె తన ఆవేదనను చెప్పారు.
తాను ఎన్నికల రాజకీయ పరీక్షలో ఓడిపోయానని చెప్పారు. తన ఓటమికి పూర్తిగా తనదే బాధ్యత అన్నారు. శక్తివంచన లేకుండా విజయం కోసం తాను కృషి చేశానని చెప్పారు. తన పట్ల చేసిన ఘాటైన వ్యాఖ్యలు వినేందుకు తన తల్లిదండ్రులు జీవించి లేరని చెప్పారు.
తాను ఎన్నికల్లో పాల్గొంది తనకు అధికారం కోసం కాదన్నారు. ఢిల్లీకి సేవ చేసేందుకు ఎన్నికల బరిలో దిగానని చెప్పారు. తాను 40 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్నానని చెప్పారు. ఈ నగరంలో తాను ఎన్నో సవాళ్లను చూశానని చెప్పారు. మహిళల రక్షణ కోసం తాను తనవంతు చేశానని చెప్పారు.

గ్రామాలకు చెందిన యువత ద్వారా పెట్రోలింగ్ చేయించానని, అంతేకాకుండా తాను వారంలో ఐదు రోజులు వెళ్లానని చెప్పారు. పాఠశాలలకు వెళ్లని చిన్నారులను స్కూళ్లకు పంపించేలా చేశానని చెప్పారు. అందులో ఇప్పుడు చాలామంది ఉపాధ్యాయులుగా, ఇతర వృత్తుల్లో ఉన్నారని చెప్పారు.
తాను ఎన్నో చేశానని అవన్ని పేరు కోసం చేయలేదన్నారు. సేవగా భావించి చేశానని, అలాగే పరిస్థితులు చేపించాయని చెప్పారు. ఢిల్లీకి ఎంతో చేయాలని తాను ఎన్నికల బరిలో దిగానని చెప్పారు. తాను అపరాధిలో ఎప్పుడు ఉండదల్చుకోలేదని అభిప్రాయపడ్డారు.
ఈ ఎన్నికల పరీక్షలో తాను ఓడానని, తనదే బాధ్యత అన్నారు. అయితే, అంతర్గతంగా తాను ఓడినట్లుగా భావించడం లేదన్నారు. తక్కువ సమయం దొరికిందని అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సవాల్ను స్వీకరించేందుకు ముందుకు రారన్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications