ఉచితం ప్రయాణం వేళ.. RTC సూపర్ న్యూస్
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఛార్జీలను భారీగా తగ్గించింది. ప్రీమియం క్లాస్ బస్సుల్లో ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ నెల 5వ తేదీన అమలులోకి వచ్చిన ఈ తగ్గింపు మూడు నెలల పాటు అంటే మార్చి వరకు కొనసాగుతుంది. వారంలో నాలుగు రోజులు సోమ, మంగళ, బుధ, గురువారాల్లో అందుబాటులో ఉంటుంది. రద్దీ అధికంగా ఉండే శుక్ర, శని, ఆదివారాల్లో ఈ తగ్గింపు ఉండదు. ఈ మూడు రోజుల్లో యధాతథ ఛార్జీని వసూలు చేస్తారు.
తక్కువ డిమాండ్ ఉండే సీజన్లో ప్రయాణీకులను ఆకట్టుకోవడానికి, ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవడానికి ఎంపిక చేసిన మార్గాల్లో ఈ తగ్గింపును ప్రకటించింది కేఎస్ఆర్టీసీ. ప్రస్తుతం ఉన్న ప్రయాణ ఛార్జీలో 5 నుండి 15 శాతం వరకు తగ్గించింది. బెంగళూరు, మైసూరు, మంగళూరు, దావణగెరె డివిజన్లలోని అన్ని ప్రధాన ప్రీమియం బస్సు సేవలకు వర్తిస్తుంది.

తిరుపతి, హైదరాబాద్, చెన్నై, పుదుచ్చేరి వంటి ప్రముఖ నగరాలకు నడిచే అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడిచే 'ఫ్లై బస్' సేవలకు కూడా రాయితీలు వర్తిస్తాయి. బెంగళూరు-మంగళూరు, బెంగళూరు-కుందాపుర, బెంగళూరు-పూణే, బెంగళూరు-ముంబై వంటి పలు కీలక మార్గాలతో పాటు కర్ణాటకలోని వివిధ గమ్యస్థానాలు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అనేక బస్సు మార్గాలలో టిక్కెట్ ధరలు తగ్గాయి.
బెంగళూరు-ఉడుపి, బెంగళూరు-ధర్మస్థల, బెంగళూరు-కుక్కేసుబ్రహ్మణ్య, బెంగళూరు-పుత్తూరు, బెంగళూరు-మడికేరి, బెంగళూరు-విరాజ్పేట, బెంగళూరు-దావణగెరె, బెంగళూరు-శివమొగ్గ, బెంగళూరు- సాగర రూట్లు ఉన్నాయి. బెంగళూరు-చెన్నై, బెంగళూరు-హైదరాబాద్/సికింద్రాబాద్, బెంగళూరు-తిరుపతి, బెంగళూరు-చెన్నై, బెంగళూరు-కోయంబత్తూరు, బెంగళూరు-త్రిస్సూర్ వంటి అంతర్రాష్ట్ర మార్గాలలోనూ ఈ రాయితీ లభిస్తుంది. ఈ ఆఫర్ 2026 జనవరి 5 నుండి అమల్లోకి వస్తుంది.
బెంగళూరు ఎయిర్ పోర్ట్-కుందాపుర మార్గంలో రూ. 2,300 నుండి రూ. 2,000కి తగ్గింది. బెంగళూరు- షిర్డి, బెంగళూరు- ముంబై మార్గంలో వెళ్లే ప్రీమియం బస్సు ఛార్జీలు రూ. 2,500 నుండి రూ. 2,000, బెంగళూరు-పూణే రూ. 2,300 నుండి రూ. 1,700కు తగ్గాయి. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒకేసారి ముందస్తు బుకింగ్ చేసుకున్నా కూడా వారికి టికెట్ ధరపై అయిదు శాతం రాయితీ లభిస్తుంది.
అలాగే- ఒకవైపు, రెండు వైపులా ప్రయాణానికి సంబంధించిన బుకింగ్లను ఒకేసారి చేస్తే, ప్రయాణ ఛార్జీలపై 10 శాతం తగ్గింపును అందిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. వోల్వో, అంబారీ, క్లబ్ క్లాస్, పల్లకి ఉత్సవ్, ఫ్లై బస్, రాజహంస, నాన్-ఏసీ స్లీపర్, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఏసీ స్లీపర్, మల్టీ-యాక్సిల్ ఏసీ స్లీపర్ వంటి ప్రముఖ బస్సుల్లోని ఎంపిక చేసిన మార్గాల్లో టికెట్ ఛార్జీలు 5 నుంచి 15 శాతం వరకు తగ్గింది.
-
కర్ణాటకలో సంచలన తీర్పు: నిర్లక్ష్యంపై సీరియస్.. -
Bengaluru: ఉలిక్కిపడ్డ గార్డెన్ సిటీ..డెడ్ బాడీతో పోలీసులకు సరెండర్..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications