కువైట్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, కీలక ఆదేశాలు: 49కి చేరిన మృతులు
కువైట్లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 49 మంది మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనలో బాధితులైన భారతీయులకు అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. మరణించిన వారి కుటుంబాలకు, గాయపడినవారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
బుధవారం సాయంత్రం ప్రధాని మోడీ నివాసంలో కువైట్లో పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. ఈ క్రమంలో కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ తక్షణ చర్యలకు సిద్ధమయ్యారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ను ఆదేశించారు. మరోవైపు, హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు.

హెల్ప్ లైన్ నెంబర్
కువైట్లో నివసిస్తున్న వారి బంధువుల సహాయం కోసం కువైట్లోని భారతీయ అధికారులు హెల్ప్లైన్ నంబర్ +965-65505246 కూడా షేర్ చేసారు.
కాగా, అంతకుముందు ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదం బాధాకరం. నా ఆలోచనలు తమ సన్నిహితులను, ప్రియమైన వారిని కోల్పోయిన వారందరితో ఉన్నాయి. క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. కువైట్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. బాధిత వ్యక్తులకు సహాయం చేయడానికి అక్కడి అధికారులతో కలిసి పని చేస్తోంది' అని పేర్కొన్నారు.
కువైట్లోని దక్షిణ మంగాస్ జిల్లాలో బుధవాంర తెల్లవారుజామున సంభవించిన ఈ భారీ అగ్నిప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 40 మంది భారతీయ కార్మికులు మరణించారు. మరో 40 మందికి పైగా భారతీయ కార్మికులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కువైట్ ఘటనపై సమాచారం అందగానే ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
Attending swearing-in ceremonies, handling negotiations on Lok Sabha Speaker post....But nothing stops him from taking stock of safety of Bharatiyas across Globe.
— BhikuMhatre (Modi's Family) (@MumbaichaDon) June 12, 2024
PM .@narendramodi Ji holds meeting to review situation relating to fire incident in Kuwait, in which 40 Bharatiyas… pic.twitter.com/BKfcWZrbxg
మరోవైపు, ఏపీలో చంద్రబాబు ప్రమాణస్వీకారం, ఒడిశాలో మోహన్ మాఝీ ప్రమాణస్వీకారానికి హాజరైన మోడీ.. హుటాహుటిన ఢిల్లీకి చేరుకుని కువైట్ ప్రమాదంపై అధికారులతో సమీక్ష జరిపారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ను కువైట్ వెళ్లాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే మృతుల్లో ఎక్కువగా కేరళ, తమిళనాడు వాసులు ఉన్నట్లు సమాచారం.
కాగా, కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 40 మందికిపైగా మరణించారని, మరో 50 మందికిపైగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే కువైట్లోని భారత ఎంబసీ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారని, బాధితులకు పూర్తి సహకారం అందజేస్తామని తెలిపారు. ప్రమాదంపై కువైట్ అధికారుల నుంచి మరింత సమాచారం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications