Wife: భార్యను ఇంటిలోనే పూడ్చిపెట్టిన ప్రభుత్వ స్కూల్ టీచర్, అక్కడే నిద్ర, జిల్లా కలెక్టర్ ఎంట్రీతో !
భోపాల్/జబల్ పూర్/మధ్యప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. భర్త ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ టీచర్ అతని భార్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నా వారికి పిల్లలు మాత్రం పుట్టలేదు. నా భార్య చనిపోయిందని ఆమె భర్త బంధువులకు సమాచారం ఇచ్చాడు. బందువులు అందరూ అంత్యక్రియలకు హాజరుకావడానికి టీచర్ ఇంటి దగ్గరకు వెళ్లారు. అయితే స్మశానవాటికలో అంత్యక్రియలు చెయ్యడానికి వీలులేదని, మా ఇంట్లోనే నా భార్య అంత్యక్రియలు జరిపించాలని భర్త పట్టుబట్టాడు. అక్కడ చాలా తంతంగం జరిగినా చివరికి అంత్యక్రియలు మాత్రం టీచర్ ఇంటిలోనే జరిగిపోయాయి, భార్యను ఇంట్లోనే పూడ్చిపెట్టిన భర్త రోజు ఆమె సమాధికి పూలు పెడుతూ పూజలు చెయ్యడం మొదలుపెట్టాడు. జిల్లా కలెక్టర్ ఎంట్రీతో అక్కడ సీన్ మొత్తం మారిపోయింది.

ప్రభుత్వ టీచర్
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాలోి దిండోరిలో ఓంకార్ దాస్ మాగ్రే అలియాస్ ఓంకార్ దాస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 సంవత్సరాల క్రితం ఓంకార్ దాస్ రుక్మిణి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న ఓంకార్ దాస్, రుక్మిణి దంపతులు ఇన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు.

పిల్లలు మాత్రం పుట్టలేదు
ఓంకార్ దాస్ ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఒంకార్ దాస్ భార్య రుక్మిణి ఇంటిలోనే ఉంటున్నది. టీచర్ ఓంకార్ దాస్ అతని భార్య రుక్మిణిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఓంకార్ దాస్, రుక్మిణి దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నా వారికి పిల్లలు మాత్రం పుట్టలేదు. భార్య రుక్మిణిని ఎన్నో ఆసుపత్రలుు తిప్పినా చివరికి ఆమెకు సంతానం కలగదని దంపతులు తేల్చి చెప్పారు.

నా ఇంట్లో నా భార్య అంత్యక్రియలు జరగాలి
10 సంవత్సరాల నుంచి రుక్మిణి ఆనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల ఓంకార్ దాస్ నా భార్య చనిపోయిందని ఆమె బంధువులకు సమాచారం ఇచ్చాడు. బందువులు అందరూ రుక్మిణి అంత్యక్రియలకు హాజరుకావడానికి టీచర్ ఓంకార్ దాస్ ఇంటి దగ్గరకు వెళ్లారు. అయితే స్మశానవాటికలో రుక్మిణి అంత్యక్రియలు చెయ్యడానికి వీలులేదని, మా ఇంట్లోనే నా భార్య అంత్యక్రియలు జరిపించాలని ఓంకార్ దాస్ పట్టుబట్టాడు.

ఎంతచెప్పినా టీచర్ వినలేదు
రుక్మిణి అంత్యక్రియలు ఇంటిలో జరపడానికి బంధువులు సైతం అంగీరించలేదు. నేను ఆత్మను, మనిషి మరణాన్ని వేరు చెయ్యలేనని, ఇక్కడే అంత్యక్రియలు జరగాలని ఓంకార్ దాస్ పట్టుబట్టాడు. తరువాత అక్కడ చాలా తంతంగం జరిగినా చివరికి రుక్మిణి అంత్యక్రియలు మాత్రం టీచర్ ఓంకార్ దాస్ ఇంటిలోనే జరిగిపోయాయి,

జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
రుక్మణి అంత్యక్రియలు ఇంటిలో జరగడానికి వీలులేదని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదినా సొంత ఇల్లు, ఎవ్వరు ఎన్ని చెప్పినా నేను మాట వినను అంటూ ఓంకార్ దాస్ ఎదురుతిరిగాడు. స్థానికులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఏమీ చెయ్యలేక చేతులు ఎత్తేశారు. స్థానికులు జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

అడ్డుపడిన భర్త
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఓంకార్ దాస్ ఇంటికి వెళ్లి బలవంతంగా రుక్మిణి శవం బయటకు తీశారు. ఆ సందర్బంలో కూడా ఓంకార్ దాస్ అడ్డుపడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి రుక్మిణి శవం ఇంటి నుంచి బయటకు తీసి స్మశానవాటికకు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించడంతో స్థానికులు హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారi.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications