చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Love marriage: రెండు ఫ్యామిలీలు కలిసి పెళ్లి చేశారు. అంతలోనే ఏమైయ్యింది ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/తుత్తుకూడి: యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. చాలాకాలం పాటు ఇద్దరూ సంతోషంగా తిరిగేశారు. తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంటికి వెళ్లిన దంపతులు రాత్రి భోజనం చేసిన తరువాత ఇంటి నుంచి బయటకు వచ్చి కొంతసేపు వీదిలో తిరిగారని తెలిసింది. ఇంటికి వెళ్లిన లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు తరువాత తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న మూడు నెలలకే ఒకే తాడుకు నవదంపతులు వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది.

couple: రాత్రి ఇంట్లోకి వెళ్లారు, మూడు రోజుల తరువాత దంపతులు ?, ఇంట్లో ఏం జరిగింది ?couple: రాత్రి ఇంట్లోకి వెళ్లారు, మూడు రోజుల తరువాత దంపతులు ?, ఇంట్లో ఏం జరిగింది ?

 ఉద్యోగం చేస్తున్న యువకుడు

ఉద్యోగం చేస్తున్న యువకుడు

తమిళనాడులోని తూత్తుకుడి సమీపంలోని తరువైకులం అనంతమదన్ పచేరి ప్రాంతంలో మరియప్పన్ అనే ఆయన నివాసం ఉంటున్నాడు. మరియప్పన్ కు తంగమునిస్వామి (29) అనే కుమాకుడు ఉన్నాడు. తుత్తుకూడి సమీపంలోని ఓ పవర్‌ స్టేషన్‌లో తంగమునిస్వామి కాంట్రాక్ట్‌ కార్మికుడిగా చాలా సంవత్సరాల నుంచి పని చేసేవాడు.

 ప్రేమికులకు పెళ్లి చేసిన రెండు ఫ్యామిలీలు

ప్రేమికులకు పెళ్లి చేసిన రెండు ఫ్యామిలీలు

తంగమునిస్వామి ద్వారంగ ప్రాంతానికి చెందిన సీతాలక్ష్మి(23) అనే యువతితో పరిచయం పెంచుకున్నాడు. మొదట ఇద్దరూ స్నేహితులుగా ఉన్నారు. రానురాను తంగమునిస్వామి, సీతాలక్ష్మి ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి అయినా పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు డిసైడ్ అయ్యారు. కేవలం 2 నెలల క్రితం ఇరు వైపుల కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించి తంగమునిస్వామి, సీతాలక్ష్మికి ఇద్దరికీ తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు, స్నేహితులు కలిసి పెళ్లి చేశారు.

 దంపతులు మాయం కావడంతో ?

దంపతులు మాయం కావడంతో ?

తంగమునిస్వామి, సీతాలక్ష్మి దంపతులు అనంతమాదన్ ఏరియాలో ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని అక్కడే ఇద్దరూ నివసిస్తున్నారు. తంగ మునియసామి ఇంటికి మూడు రోజులుగా తాళం వేసి ఉంది. అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

 ఆత్మహత్య చేసుకున్నారా ?

ఆత్మహత్య చేసుకున్నారా ?

ఒకేతాడుకు తంగమునియసామి, మరో వైపు సీతాలక్ష్మి ఉరివేసుకుని మృతి చెందారని వెలుగు చూడటంతో స్థానికులు, బంధువులు షాక్‌కు గురైనారు. ఇరుగుపొరుగు వారు ఇచ్చిన సమాచారం మేరు దరువైకులం పోలీస్ స్టేషన్‌ అధికారులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 మూడు నెలలకే ఇద్దరి జీవితాలు ముగిసిపోయాయి

మూడు నెలలకే ఇద్దరి జీవితాలు ముగిసిపోయాయి

పెళ్లయిన రోజు నుంచి తంగమునిస్వామి, సీతాలక్ష్మీల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఆ గొడలు ఎందుకు జరుగుతున్నాయో అర్దం కావడం లేదని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తంగమునిస్వామి, సీతాలక్ష్మి దంపతులు ఆ రోజు రాత్రి ఇంటిలోకి వెళ్లిన తరువాత ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందన, తరువాత ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఒకే తాడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దారువైకులం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 3 నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఒకేసారి ఒకేతాడుకు ఉరి బిగించుకుని ఆత్మహత్మ చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

English summary
Love marriage: Everyone was shocked when the new couple committed suicide at the same time near Thoothukudi in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X