Girlfriend: ఇంట్లో దూరి ప్రియురాలు, ఆంటీ మీద ?, అనుమానంతో లవర్, ఫేస్ బుక్ తో తంటా !
పాట్నా/చెన్నై: యువతి, యువకుడికి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. సంవత్సరం నుంచి ఇద్దరూ చాలాసార్లు బయట కలుసుకుని తిరిగారు. యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. ఇంతో ప్రియురాలి మీద ప్రియుడికి అనుమానం మొదలైయ్యింది. ప్రియురాలు కూడా రానురాను ప్రియుడిని దూరం పెడుతూ వచ్చింది. తన ప్రియురాలు దూరం అవుతోందని ప్రియుడు రగిలిపోయాడు. అంతే నేరుగా ప్రియురాలి ఇంటికి వెళ్లి రివాల్వర్ తీసుకుని ప్రియురాలు, ఆమె తల్లి మీద కాల్పులు జరిపాడు. రివాల్వర్ తూటాలకు ప్రియురాలు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంటీ తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. ఇంట్లో దూరి తల్లి కూతురి మీద కాల్పులు జరిపిన ప్రియుడిని స్థానికులు పట్టుకుని చితకబాదేసి పోలీసులకు అప్పగించారు. అందరూ చూస్తున్న సమయంలో తల్లీ, కూతురిని రివాల్వర్ తో కాల్చడం కలకలం రేపింది.

ఫేస్ బుక్ లో పరిచయం
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలోని కైలోరా గ్రామంలో నివాసం ఉంటున్న రష్మీ (పేరు మార్చడం జరిగింది), మధురలోని కోసికల్ హాసన్ ప్రాంతంలోని మహాసింగ్ పూర్ లో నివాసం ఉంటున్న నరేంద్ అలియాస్ రింకు అనే యువకుడికి సంవత్సరం క్రితం ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. తరువాత రష్మీ, నరేంద్ర వారి ఫోన్ నెంబర్లు మార్చుకుని ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు.

బైక్ లో ప్రియురాలి ఇంటికి
గురువారం రాత్రి నరేంద్ర అతని స్నేహితుడు బైక్ లో రష్మీ ఊరికి వెళ్లారు. స్నేహితుడు బైక్ మీద బయట ఉండటంతో నరేంద్ర నేరుగా రష్మీ ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో రష్మీ, బెడ్ రూమ్ లో ఆమె తల్లి మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో నరేంద్ర ప్రియురాలు రష్మీతో గొడవపెట్టుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోవడంతో నరేంద్ర సహనం కల్పోయాడు.

కాల్పులతో హడల్
ప్రియురాలితో చాలా సేపు గొడవ పడిన నరేంద్ర జోబులో నుంచి రివాల్వర్ బయటకు తీసి రష్మీ కడుపులో కాల్చేశాడు. అదే సమయంలో రష్మీ తల్లి మీద కాల్పులు జరపడంతో ఆమె తిప్పించుకోవడంతో బుల్లెట్లు పక్కకు దూసుకుపోయి ఆమెకు గాయాలైనాయి. తుపాకి కాల్పులు శభ్దం వినిపించడంతో స్ధానికులు రష్మీ ఇంటి దగ్గరకు పరుగు తీశారు.

బెండ్ తీసేశారు... ప్రియురాలి ప్రాణం పోయింది
ప్రియురాలిపై కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించిన నరేంద్ర, అతని స్నేహితుడి వెంటాడి పట్టుకున్న స్థానికులు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. రక్తపు మడుగులో పడి ఉన్న రష్మీని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహామేరకు రష్మీని ఆలీగడ్ ముస్లీం విశ్వవిధ్యాలయం మెడికల్ కాలేజ్ (AMU)కు తరలించారు. చికిత్స విఫలమై రష్మీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రష్మీ తల్లి చికిత్స పొందుతూ కొలుకుంటోందని పోలీసులు అంటున్నారు.

ప్రియురాలి మీద అనుమానం ?
గత సంవత్సరం నుంచి నరేంద్ర, రష్మీ చాలాసార్లు బయట కలుసుకుని తిరిగారని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారని తెలిసిందని పోలీసు అధికారి సురేంద్ర సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు. ఇంతలో ప్రియురాలు రష్మీ మీద ప్రియుడు నరేంద్రకు అనుమానం మొదలైయ్యిందని వెలుగు చూసింది.
Recommended Video

తేడాలు వచ్చాయి... అందుకే హత్య
ప్రియురాలు కూడా రానురాను ప్రియుడిని దూరం పెడుతూ వచ్చిందని సురేంద్ర సింగ్ చెప్పారు. తన ప్రియురాలు రష్మీ ఎక్కడ దూరం అవుతుందో అనే ఆవేశంలో నరేంద్ర ఇంట్లో దూరి రివాల్వర్ తో కాల్చి చంపేశాడని పోలీసు అధికారి సురేంద్ర సింగ్ చెప్పారు. కంట్రీ మేడ్ రివాల్వర్ యువతి హత్యకు ఉపయోగించాడని, నరేంద్ర ఆ రివాల్వర్ ఎక్కడ కొనుగోలు చేశాడో అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద తుపాకి కాల్పులతో ఉత్తరప్రదేశ్ ప్రజలు మరోసారి హడలిపోయారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications