LPG eKYC Update: గ్యాస్ కావాలంటే మళ్లీ ఈ-కేవైసీ ? తేల్చేసిన కేంద్రం..!
ఇరాన్ వార్ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కష్టాలు (LPG Crisis) అంతకంతకూ పెరుగుతున్నాయి. యుద్ద భయాలతో ఎక్కడికక్కడ సిలెండర్లు బ్లాక్ చేస్తుండటంతో తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఓవైపు అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నా సిలెండర్ల బ్లాకింగ్ ఆగట్లేదు. దీనికి విరుగుడుగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో ఒకటి ఈ-కేవైసీని (LPG eKYC)గ్యాస్ సిలెండర్ కు తప్పనిసరి చేయడం.
దేశవ్యాప్తంగా ఎల్పీజీ తాజా పరిస్దితిపై రోజువారీ ప్రకటనలు చేస్తున్న కేంద్రం.. తాజాగా గ్యాస్ సిలెండర్ కావాలంటే తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని వినియోగదారుల్ని కోరింది. దీంతో ఇప్పటికే ఈ-కేవైసీ చేయించుకున్న వారితో పాటు చేయించుకోకుండా గ్యాస్ సిలెండర్లు తీసుకుంటున్న వారిలోనూ ఆందోళన మొదలైంది. వీరంతా గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కట్టడం మొదలుపెట్టారు. అలాగే కేంద్రానికీ లక్షల సంఖ్యలో మెయిల్స్, మెసేజ్ లు, కాల్స్ రావడం మొదలైంది.

Clarification: LPG Biometric Aadhaar Authentication (eKYC) only required for unauthenticated LPG customers and not all customers pic.twitter.com/oySbhPgJ47
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) March 17, 2026
దీంతో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ ఇవాళ గ్యాస్ సిలెండర్ కు ఈ-కేవైసీపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఈ-కేవైసీ చేయింంచుకున్న వారికి ఇది అవసరరం లేదని, ఇప్పటివరకూ చేయించుకోని వారికి మాత్రమే తాము ఈ-కేవైసీ చేయించుకోవాలని కోరుతున్నామంటూ వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్టు పెట్టింది. గ్యాస్ కొరత నేపథ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు గ్యాస్ వినియోగదారులందరికీ బయోమెట్రిక్ ఆధార్ ద్వారా నిర్ధారించుకోవడమే తమ ఉద్దేశమని తెలిపింది. అలాగే ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకంలో ఉన్న వారు ఏడాదికి ఒకసారి ఈ-కేవైసీ చేయించుకుంటే సరిపోతుందని వెల్లడించింది. అదీ ఏడు రీఫిల్స్ తర్వాత తీసుకునే 8,9 రీఫిల్స్ కు మాత్రమేనని తెలిపింది.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications