బలనిరూపణకు గవర్నర్ డెడ్లైన్: ‘మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సర్కారును కరోనా కూడా కాపాడలేదు’
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు రాజీనామా చేయడంతో సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు కరోనావైరస్ భయాందోళనల నేపథ్యంలో మార్చి 26 వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే.

కమల్నాథ్ సర్కారుకు 24గంటల డెడ్ లైన్
అసెంబ్లీ స్పీకర్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో మధ్యప్రదేశ్ కమల్ నాథ్ ప్రభుత్వ కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే, కొద్దిగంటల్లోనే ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి షాకిచ్చారు. మంగళవారంలోగా అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. లేకుంటే ప్రభుత్వం మైనార్టీలో పడిందని పరిగణించాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు.

కాంగ్రెస్ సర్కారును కరోనా కూడా కాపాడలేదు..
ఇది ఇలావుండగా, బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కమల్నాథ్ ప్రభుత్వాన్ని కరోనావైరస్ కూడా కాపాడలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ను కలిశారాయన. అంతేగాక, 107 మందికి గాను 106 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్లో గవర్నర్ ఎదుట పరేడ్ నిర్వహించారు.

మైనార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం..
అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. మెజార్టీ లేదని తెలిసి సీఎం కమల్ నాథ్ బల నిరూపణ పరీక్ష నుంచి పారిపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందనీ.. అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు. బీజేపీకే మెజార్టీ ఉందని, త్వరగా బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని ఈ మాజీ సీఎం చెప్పారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆరుగురు మంత్రులతోపాటు 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications