Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పట్టాలు తప్పిన హౌరా మెయిల్ మూడు బోగీలు: అప్రమత్తతో తప్పిన ప్రమాదం

నాసిక్‌: ఆదివారం తెల్లవారుజామున ముంబై-హౌరా మధ్య ప్రయాణించే రైలు పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని నాసిక్‌ వద్ద రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఎలాంటి సమాచారం అందలేదు.

ముంబై నుంచి హౌరాకు(12809) నాగ్‌పూర్‌ మీదుగా వెళ్లే ఈ రైలు బయల్దేరిన కొద్దిసేపటికే ఇగత్‌పురి వద్దకు రాగానే ఎస్‌-12,ఎస్‌-13, ప్యాంట్రీ కార్‌ బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందనుకుంటున్నామని చెప్పారు.

Maharashtra: Three coaches of Howrah Mail derail

వెంటనే అప్రమత్తం అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మరమ్మతు చర్యలు ప్రారంభించామని, ఈ ఘటలో ఇప్పటివరకూ ఎవరికీ ప్రాణహాని జరగలేదని చెప్పారు.

ఘటనపై మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తామ అని రైల్వే అధికారి తెలిపారు. కాగా, ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే 12 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+