మహారాష్ట్ర రాజకీయం-మంత్రుల ఎంపికలో ఫడ్నవీస్ కు నో ఫ్రీ హ్యాండ్-మారిన సమీకరణాలతో
మహారాష్ట్రలో శివసేనలో తిరుగుబాటు మొదలుపెట్టి చివరికి బీజేపీతో పొత్తు పెట్టుకుని సీఎం అయిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం .. ఇప్పుడు కేబినెట్ మంత్రుల ఎంపికపై దృష్టిసారించింది. అయితే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ కు మాత్రం ఈసారి చిక్కులు తప్పేలా లేవు. ఆయనకు గతంలోలా మంత్రుల ఎంపికలో స్వేచ్ఛ లభించేలా కనిపించడం లేదు.
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు కౌంటర్ ఇచ్చేందుకు ఏక్ నాథ్ షిండేను వాడుకుని సీఎం చేసిన బీజేపీకి ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ రూపంలో డిప్యూటీ సీఎం పదవి తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆయనకు గతంలో బీజేపీ-శివసేన పొత్తు ఉన్నప్పుడు మంత్రుల్ని ఎంపిక చేసే స్వేచ్ఛ ఉండేది. కానీ ఈసారి మాత్రం షిండే ఆయనకు ఆ అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఢిల్లీ బీజేపీ పెద్దల్లో ఆందోళన పెరుగుతోంది. షిండే చెప్పినట్లు ఫడ్నవీస్ వినాల్సిన పరిస్ధితులు దాపురించడంతో ఆయనకు కేబినెట్ బెర్తుల ఎంపికలో స్వేచ్ఛ లభించడం లేదని తెలుస్తోంది. ఇది అంతిమంగా బీజేపీకి దెబ్బగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

పార్టీలో ఇతరులకు కూడా అవకాశాలు ఇవ్వాలనే అభిప్రాయం ఉందని, దాని ప్రకారం, కొంతమంది కొత్త ముఖాలు ప్రభుత్వంలోకి రావచ్చని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. 2014లో ఫడ్నవీస్కు శాఖల కేటాయింపులో చాలా ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చారు. ఈసారి అది సాధ్యం కాకపోవచ్చని స్వయానా బీజేపీ నేతలే చెప్తున్నారు. ఈసారి సుధీర్ ముంగంటివార్ వంటి నాయకులను పార్టీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నందున హోమ్ పోర్ట్ఫోలియో కూడా ఆయనకు వెళ్లే అవకాశం ఉందని ఢిల్లీకి చెందిన బిజెపి నేత చెప్పారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications