వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రదాడిని భగ్నం చేసిన సైన్యం, పోలీస్

|
Google Oneindia TeluguNews

గౌహతి: అసోంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చెయ్యడంతో ప్రజలు, రైల్వే ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అసోంలోని కొక్రాఝర్- గువహటి రైల్వే ట్రాక్ ను పేల్చడానికి కేఎల్ వో ఉగ్రవాదులు కుట్ర పన్నారు. రైల్వే ట్రాక్ మీద 7 కిలోల పేలుడు పదార్థాలు అమర్చేందుకు ప్రయత్నించారు

విషయం తెలుసుకున్న సైనికాధికారులు, అసోం పోలీసులు సంయుక్తంగా అపరేషన్ చేపట్టారు. వెంటనే తనిఖీలు చేశారు. ఆ సందర్బంలో ఉగ్రవాదులు రైల్వే ట్రాక్ సమీపంలో ఎదురుపడ్డారు. ఉగ్రవాదులు పోలీసులు, సైనికాధికారుల మీద కాల్పులు జరిపారు.

 A major KLO terror bid was foiled in Assam

పోలీసులు, సైనికులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పులలో ఒక ఉగ్రవాది మరణించాడని పోలీసు అధికారులు తెలిపారు. మిగిలిన ఉగ్రవాదులు అక్కడి నుండి తప్పించుకున్నారు. ఉగ్రవాదులు తీసుకు వచ్చిన 7 కిలోల పేలుడు పదార్థాలను ( ఐఈడీ) పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా పిస్టల్, మేగజైన్, బాంబులు, రెండు గ్రేనెడ్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఉగ్రవాదులు అసోంలో దాడులకు పాల్పడుతారని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించిన నేపధ్యంలో అసోంలో సోదాలు ముమ్మరం చేశారు.

English summary
As per reports, a joint team of the Indian Army and Assam Police neutrailsed Kamtapur Liberation Organisation (KLO) terrorists who were trying to plant an improvised explosive device (IED) on a railway track.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X