హోటల్ గదిలో ఉరేసుకుని వ్యాపారవేత్త ఆత్మహత్య

Major Pune Builder Found Hanging in Hotel He Partly Owned
పూణే: ప్రముఖ పూణే వ్యాపారవేత్త ఈశ్వర్దాస్ చోర్డియా కుమారుడు, బిల్డర్ అజయ్ చోర్డియా ఆత్మహత్య చేసుకున్నారు. హోటలో గదిలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హోటల్‌లో అజయ్ చోర్డియా భాగస్వామి కూడా. హోటల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆయన మరణించాడు. సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

అజయ్ చోర్డియా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమకు సూసైడ్ నోట్ లభించిందని, ఆ నోట్‌ను తాము పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

చోర్డియా మృతదేహాన్ని పింప్రి ప్రాంతంలోని యశ్వంత్ రావు చవాన్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు చోర్డియాను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు పోలీసులు తెలిపారు.

పూణేలోని పంచశీల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యజమానిగా 47 ఏళ్ల అజయ్ చోర్డియా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీలో నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ (ఎన్సీపి) అధినేత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే వాటా కూడా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+