వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోటల్ గదిలో ఉరేసుకుని వ్యాపారవేత్త ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Major Pune Builder Found Hanging in Hotel He Partly Owned
పూణే: ప్రముఖ పూణే వ్యాపారవేత్త ఈశ్వర్దాస్ చోర్డియా కుమారుడు, బిల్డర్ అజయ్ చోర్డియా ఆత్మహత్య చేసుకున్నారు. హోటలో గదిలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హోటల్‌లో అజయ్ చోర్డియా భాగస్వామి కూడా. హోటల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆయన మరణించాడు. సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

అజయ్ చోర్డియా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమకు సూసైడ్ నోట్ లభించిందని, ఆ నోట్‌ను తాము పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

చోర్డియా మృతదేహాన్ని పింప్రి ప్రాంతంలోని యశ్వంత్ రావు చవాన్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు చోర్డియాను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు పోలీసులు తెలిపారు.

పూణేలోని పంచశీల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యజమానిగా 47 ఏళ్ల అజయ్ చోర్డియా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీలో నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ (ఎన్సీపి) అధినేత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే వాటా కూడా ఉంది.

English summary
Ajay Chordia, the son of well-known Pune businessman Ishwardas Chordia, was found dead in a hotel which he partly owned. According to the police, Mr Chordia was found hanging from a ceiling fan in his hotel room on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X