హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘బెంగళూరును దేశ రెండో రాజధానిని చేయండి’

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశ రెండో రాజధానిగా బెంగళూరును చేయాలని ఆ రాష్ట్ర మధ్యతరహా, భారీ పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ మంత్రి ఆర్‌వి దేశ్‌పాండే ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన మోడీకి లేఖ రాశారు. దేశానికి రెండో రాజధాని చాలా ముఖ్యమని, ఆ స్థానాన్ని బెంగళూరు నగరం భర్తీ చేయగలదని అభిప్రాయపడ్డారు.

'బెంగళూరు నగరం దేశానికి దక్షిణ ప్రాంతంలో ఉంది. ఇక్కడ చక్కటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. పకృతి వైపరిత్యాలకు ఆస్కారంలేని ప్రాంతమిది. వివిధ రంగాలకు చెందిన నిపుణులు, వ్యాపారులు ఇక్కడ చాలా మంది ఉన్నారు' అని తెలిపారు.

హైదరాబాద్ దేశ రెండో రాజధాని?: తేల్చేసిన కేంద్రమంత్రిహైదరాబాద్ దేశ రెండో రాజధాని?: తేల్చేసిన కేంద్రమంత్రి

Make Bengaluru Second Capital of India: Karnataka Minister Urges PM Modi

అంతేగాక, 'బెంగళూరులో పరిశ్రమల అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యం ఉంది. భారతదేశానికి అర్జెంటుగా రెండో రాజధాని అవసరం.. దీనికి బెంగుళూరు బాగా సరిపోతుంది' అంటూ దేశ్‌పాండే లేఖలో వివరించారు.

కాగా, ఇప్పటికే హైదరాబాద్‌ను రెండో రాజధాని చేయాలని తెలంగాణ ఎంపీలు కోరిన విషయం తెలిసిందే. ఇటీవల లోకసభలో తెలంగాణ ఎంపీ బూరనర్సయ్యగౌడ్‌ హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేసే ప్రతిపాదన ఏమైనా కేంద్రం వద్ద ఉందా? అని ప్రశ్నవేయగా.. కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.

English summary
Ahead of the Karnataka Assembly elections, the state Industries minister RV Deshpande has written a letter to the Prime Minister Narendra Modi to make Bengaluru the second capital city of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X