Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగాల్లో "ఇండియా" ప్రచారం మొదలుపెట్టేసిన మమత-బేటీ జలావో అంటూ కేంద్రంపై దాడి..

వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా ఓడించే లక్ష్యంతో ఇండియా పేరుతో విపక్షాలు జట్టు కట్టాయి. ఇందులో వారికి ఇండియా పేరును సూచించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఇప్పుడు దాన్ని జనంలోకి తీసుకెళ్లే విషయంలోనూ తొలి అడుగు వేశారు. ఇవాళ పశ్చిమబెంగాల్లో ఇండియా కూటమి తరఫున మమత ప్రచారం ప్రారంభించారు. అంతే కాదు తొలిరోజే మణిపూర్ ఘటనల్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు.

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా పోరాడుతుందని, అలాగే తన పార్టీ టీఎంసీ జెండా మోసే సైనికుడిలా ప్రచారంలో భాగస్వామి అవుతుందని మమతా బెనర్జీ వెల్లడించారు. 2019 ఎన్నికల్లో 40 సీట్లలో 22 స్థానాలను గెలుచుకున్న టీఎంసీ.. "జై బంగ్లా" (పశ్చిమబెంగాల్ కు విజయం) నినాదంతో పాటు "జై ఇండియా" (భారతదేశానికి విజయం) నినాదాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, అన్ని పార్టీ కార్యక్రమాలలో వాటిని ఉపయోగించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

mamamta banerjee launches INDIA campaign in west bengal, beti jalao attack on manipur incident

1993లో మమతా బెనర్జీ నేతృత్వంలోని సాగిన నిరసనలో పోలీసు కాల్పుల్లో మరణించిన 13 మంది కాంగ్రెస్ కార్యకర్తల మరణాలకు గుర్తుగా జూలై 21ని "అమరవీరుల దినోత్సవం"గా గుర్తించేందుకు కోల్‌కతాలో జరిగిన టీఎంసీ వార్షిక ర్యాలీలో మమత నిర్ణయించారు. భారతదేశం పోరాడుతుందని, టీఎంసీ జెండా మోసిన సైనికుడిలా దాని పక్కన నిలబడుతుందని మమత ప్రకటించారు. భారత్‌ను గెలిపించండి. బీజేపీని ఓడిపోనివ్వండి, మోడీ ఓడిపోతారు. అది తన ఏకైక నినాదం అన్నారు.

వచ్చే 2024 ఎన్నికల్లో తమ పార్టీ నినాదమైన 'జై బంగ్లా'తో పాటు 'జై ఇండియా' నినాదాన్ని కూడా లేవనెత్తుతామని తెలిపారు. ఈ నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు తమ కార్యక్రమాలన్నింటిలోనూ ఈ నినాదాన్ని లేవనెత్తుతామని మమత ప్రకటించారు. టీఎంసీకి కుర్చీ వద్దన్నారు.

mamamta banerjee launches INDIA campaign in west bengal, beti jalao attack on manipur incident

అలాగే దేశం ఇకపై బీజేపీని సహించదన్నారు. 2024 ఎన్నికలకు ముందు మనం ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నాననని తెలిపారు. పోరాటమంతా ఈ బ్యానర్‌లోనే సాగుతుందని, భారత్ గెలుస్తుందని, తమకు కుర్చీ అక్కర్లేదని, బీజేపీని గద్దె దింపాలని కోరుకుంటున్నామన్నారు.

మే 4న ఇద్దరు మహిళలను బట్టలు విప్పి, ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన మణిపూర్ ఘటనపై కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మమతా బెనర్జీ దాడిని తీవ్రతరం చేశారు. మణిపూర్ ప్రజలకు తాము సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని, వారితో తాము ఉన్నామని తెలిపారు. భాజపా బేటీ బచావో నినాదం ఎక్కడుందన్నారు. ఈరోజు కూతురు కాలిపోతోందన్నారు. మణిపూర్ మండుతోంది, మీరు (బీజేపీ) మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తే, 2024 ఎన్నికల్లో మిమ్మల్ని తరిమికొడతారని హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+