పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో మహిళలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని నల్లగొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.ఓ బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, గుండెపోటు డ్రామా ఆడాడు. పోలీసులు ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్య పరీక్షలు చేయించి, అంతా సక్రమంగా ఉండటంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.నల్లగొండ క్లాక్‌టవర్‌ సెంటర్‌లోని చర్చిలో తులకొప్పుల శామ్యూల్‌ విలియమ్స్‌ పియానో వాయిస్తూ పాటలు పాడుతుంటాడు. దాంతోపాటు వైఎంసీఏ స్వచ్ఛంద సంస్థనూ స్థాపించాడు.కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటున్న పట్టణంలోని శ్రీనివాస్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు విలియమ్స్‌తో పరిచయం ఏర్పడింది. అండగా ఉంటానని నమ్మించిన విలియమ్స్‌ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.అనంతరం ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తూ 9 ఏండ్లుగా ఆమెతోనే సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇల్లు కట్టిస్తానని బాధితురాలి వద్ద రూ.20 లక్షలు తీసుకున్నాడు.ఇదిలా ఉండగా చర్చికి వచ్చే ఓ యువతికి వైఎంసీఏలో ఉద్యోగం ఇస్తానని లోబర్చుకుని ఆరు నెలలుగా ఆమెతో ఉంటున్నాడు. గత నెల 25న ఆమెను వివాహం చేసుకున్నాడు.విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌నగర్‌కు చెందిన మహిళ గత నెల 31న విలియమ్స్‌ను నిలదీసింది. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు.తప్పించుకున్న ఆమె డయల్‌ 100కు ఫోన్‌ చేసింది. పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వెనుక నుంచి గోడ దూకి పారిపోయాడు.మరుసటి రోజు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకునేందుకు అంగీకరించి.. వాయిదాలు వేస్తుండటం తో ఈనెల 5న బాధితురాలు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసుల విచారణలో విలియమ్స్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నల్లగొండ ఉమ్మడి జిల్లాతోపాటు విదేశాల్లోని పలువురు మహిళలతో నిందితుడికి సంబంధాలున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.సోమవారం రాత్రి పోలీసులు విలియమ్స్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా గుండెపోటు వచ్చిందని పట్టణంలోని ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేరాడు. మంగళవారం ఉదయం పోలీసులు అతడిని ప్రభుత్వ దవాఖానకు తరలించి పరీక్షలు చేయించగా.. అన్నీ నార్మల్‌గా వచ్చాయి. దీంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.అల్లు అర్జున్‌కు లీగల్ నోటీసు పంపిస్తాం - టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రుల సమావేశంలో జగన్, నవీన్ పట్నాయక్ ఏం చర్చించారంటే..ట్విటర్‌లో అత్యంత ప్రభావశీల ప్రముఖులలో రెండవ స్థానంలో మోదీట్విటర్‌లో అత్యంత ప్రభావశీల ప్రముఖుల జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచారని ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది.ట్విటర్‌లో టాప్‌-50 ప్రభావశీల వ్యక్తుల జాబితాను వినియోగదారుల నిఘా సంస్థ బ్రాండ్‌వాచ్‌ తమ వార్షిక పరిశోధన నివేదికలో వెల్లడించింది.ఈ జాబితాలో అమెరికా గాయని టేలర్‌ స్విఫ్ట్‌ అగ్రస్థానంలో నిలిచారు.భారత మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 35వ స్థానంలో ఉన్నారు.అరకు దారిలో అద్దాల బోగీ ట్రయల రన్అరకు పర్యాటకులకు కొత్త అద్దాల బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాల్తేర్‌ అధికారులు కృషి చేస్తున్నారని ఈనాడు తెలిపింది.కార్తికమాసం వనభోజనాల సీజన్‌ మొదలవడంతో ఆయా బోగీలను వీలైనంత త్వరగా పట్టాలపైకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నట్లు సమాచారం.ఎప్పటి నుంచి వాటిని పూర్తి స్థాయిలో పట్టాలెక్కించాలనే అంశంపై ఇంకా నిర్ణయానికి రాలేదు.ఇలా ఉండగా ఇప్పటికే ఎల్‌హెచ్‌బీ బోగీలతో కూడిన అద్దాల బోగీల రైలును అరకు మార్గంలో ఒకసారి ట్రయల్‌ రన్‌ పూర్తి చేశారు.రెండు అద్దాల బోగీలతో కూడిన ఎల్‌హెచ్‌బీ బోగీల రైలును అదే మార్గంలో మంగళవారం మరోసారి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో గతంలో గుర్తించిన సమస్యలను పరిష్కరించిన అనంతరం ఈ ట్రయల్‌ రన్‌ నిర్వహించినట్లు సమాచారం.వారణాసి: మోక్షానికే కాదు, శాకాహార భోజన ప్రియులకు కూడా స్వర్గధామంగా మారిన ప్రాచీన నగరంకాలుష్యం, పెట్రోల్ ధరల వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయా?టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ రోహిత్ శర్మటీమిండియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను నియమిస్తున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించిందని సాక్షి పత్రిక వెల్లడించింది.యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ టోర్నీ సందర్భంగా టి20 ప్రపంచకప్‌ తర్వాత తాను భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని విరాట్‌ కోహ్లి ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కోహ్లి స్థానంలో మరో సీనియర్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మను ఈ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ రోహిత్‌ శర్మకే టీ20 పగ్గాలు అప్పగించింది. కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.టీ20 ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ కొత్తేమీ కాదు. ఐపీఎల్‌లో రోహిత్‌ సారథ్యంలో ముంబై ఇండియన్స్‌ జట్టు ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది.గతంలో కోహ్లి గైర్హాజరీలో రోహిత్‌ శర్మ 19 మ్యాచ్‌ల్లో భారత టీ20 జట్టుకు తాత్కాలికంగా నాయకత్వం వహించాడు. రోహిత్‌ కెప్టెన్సీలో భారత జట్టు 15 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడింది. 2017లో 3 మ్యాచ్‌ల్లో, 2018లో 9 మ్యాచ్‌ల్లో, 2019లో 6 మ్యాచ్‌ల్లో, 2020లో ఒక్క మ్యాచ్‌లో రోహిత్‌ భారత టీ20 జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్‌ దశలోనే నిష్క్రమించడం... ఈనెల 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఉండటంతో మంగళవారం బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.ఫిట్‌నెస్‌ సమస్యలు.. ఫామ్‌లో లేకపోవడం కారణంగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిలపై సెలెక్టర్లు వేటు వేశారు.టీ20 ప్రపంచకప్‌లో ఆడిన శార్దుల్‌ ఠాకూర్, రాహుల్‌ చహర్‌లను కూడా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదు.కోహ్లి, బుమ్రా, షమీ, రవీంద్ర జడేజాలకు వారి కోరిక మేరకు విశ్రాంతి ఇచ్చారు. శ్రేయస్‌ అయ్యర్, యజువేంద్ర చహల్, అక్షర్‌ పటేల్, దీపక్‌ చహర్, హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌లకు మళ్లీ పిలుపు వచ్చింది.ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌), హర్షల్‌ పటేల్‌ (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు), అవేశ్‌ ఖాన్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌)లకు తొలిసారి జాతీయ జట్టులో స్థానం దక్కింది.భారత టీ20 జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), వెంకటేశ్‌ అయ్యర్, యజువేంద్ర చహల్, అశ్విన్, అక్షర్‌ పటేల్, అవేశ్‌ ఖాన్, భువనేశ్వర్, దీపక్‌ చహర్, హర్షల్‌ పటేల్, మొహమ్మద్‌ సిరాజ్‌.ఇవి కూడా చదవండి:టీ20 కెప్టెన్సీ రోహిత్‌కు అప్పగించడానికి ఇదే సరైన సమయం’ - విరాట్ కోహ్లీపద్మశ్రీ హరెకల హజబ్బ: పండ్లు అమ్ముకునే నిరక్షరాస్యుడు.. స్కూలు నిర్మించి, విద్యను అందిస్తున్నాడుస్వస్తిక: హిట్లర్ హిందూ మత చిహ్నాన్ని తన పార్టీ గుర్తుగా ఎందుకు ఎంచుకున్నారు?విశాఖపట్నం లైన్‌మన్‌ హత్య కేసు: మంత్రి మేనల్లుడిపై ఆరోపణలుప్రశాంత్ పంచాడ ఎవరు? అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలుగులో ఎందుకు ట్వీట్ చేశాడుకోనసీమ పెను తుపాను @25: ఆ కాళరాత్రి మిగిల్చిన భయానక జ్ఞాపకాలు...COP26: 40 దేశాలు చేసిన ప్రతిజ్ఞను ఇండియా ఎందుకు పక్కన పెట్టింది?పీవీ సింధు: పద్మభూషణ్ అవార్డు అందుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)//