Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్లమెంట్ ఆవరణలో వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పార్లమెంట్ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుర్తు తెలియని వ్యక్తి బుధవారం రైల్ భవనం వద్ద ఒంటికి నిప్పంటించుకుని పార్లమెంట్ వైపునకు పరుగులు తీయడం కలకలం రేపింది. తీవ్ర గాయాలపాలైన అతడ్ని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఘటనా స్థలం వద్ద పోలీసులు పెట్రోల్‌ను గుర్తించారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పట్‌కు చెందిన జితేంద్ర అనే వ్యక్తిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించాడనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Man attempts suicide by dousing himself with petrol on Parliament premises

అయితే, ఘటనా స్థలంలో కాలిపోయిన రెండు పేజీలు లభించినట్లు తెలిసింది. కానీ, అందులో ఏముందనేది తెలియరాలేదు. ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ బందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జితేంద్ర ఆ్మహత్యకు యత్నించడానికి గల కారణాలు తెలుసుకునేలో పోలీసులు నిమగ్నమయ్యారు. తన గ్రామంలో లేదంటే కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయనేదానిపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో ఏవైనా కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అతని మానసిక ఆరోగ్యం ఎలా ఉందనేదానిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. పార్లమెంటుకు సమీపంలో ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

తీవ్రమైన ఆలోచనలు వచ్చినప్పుడు కౌన్సెలింగ్ సేవల కోసం
iCALL మెంటల్ హెల్ప్‌లైన్ నంబర్: 9152987821 ను సంప్రదించవచ్చు. సోమమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సహాయకులు అందుబాటులో ఉంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+