మణిపూర్లో ఆరుగురు హత్య: సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి, కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య వైరంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. మైతీ వర్గానికి చెందిన ఆరుగురిని కుకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేశారు. వారి మృతదేహాలు లభ్యం కావడంతో ఒక్కసారిగా అలజడి రాజుకుంది. కుకీ ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురైన వారిలో 8 నెలల చిన్నారితోపాటు ఇద్దరు బాలికలు, మహిళలు ఉండటం గమనార్హం.
తాజా హత్యలకు నిరసనగా జిరిబామ్ జిల్లాలో మైతీలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ముఖ్యమంత్రి నివాసంతోపాటు ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన దిగడంతోపాటు దాడులకు పాల్పడ్డారు. పలువురు ఎమ్మెల్యేల ఇళ్లపైనా ఆందోళనకారులు దాడులు చేశారు.

ఈ నేపథ్యంలో ఇంఫాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్సింగ్, కాంగ్పోక్సి, చురచంద్పూర్ జిల్లాల్లో రెండు రోజులపాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కాగా, లాంఫెల్ సనకీతెల్ ప్రాంతంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసంపై ఒక గుంపు దాడి చేసిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సగోలో బంద్ ప్రాంతంలో సీఎం ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు ఆందోళనకారులు నిరసన చేపట్టారు.
🚨Manipur Erupts in Protest Over Abduction of Three Women and Three Children by Kuki-Hmar Terrorists
— Homer_Alt (@Gooner_Homer) November 15, 2024
The cry of the people : "Indian Govt. is responsible for the safety of the 6, who are held as hostage"#KukiTerrorists #KukiWarCrimes #BringMissingMeiteisHome #Justice4Meiteis… pic.twitter.com/ZPv6qVXzFJ
ఆరుగురిని హత్య చేసిన నిందితులను 24 గంటల్లో పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీఎం బీరెన్ సింగ్ ను డిమాండ్ చేశారు. మరోవైపు, కైషామ్ థాంగ్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే సపం నిషికాంత సింగ్ను తిడ్జిమ్ రోడ్లోని ఆయన నివాసంలో కలిసేందుకు నిరసనకారులు అక్కడికి వెళ్లారు. అయితే, ఆయన రాష్ట్రంలో లేరని చెప్పడంతో ఎమ్మెల్యేకు చెందిన స్థానిక వార్తాపత్రిక కార్యాలయంపై దాడి చేశారు. ఆరుగురి హత్య, దాడుల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో భారీగా భద్రతా దళాలు మోహరించాయి.
#Angrypprotesters in #Imphal city destroyed the house of #BJP MLA RK Imo following #slaughtering of six members of a #MEITEI family-- three women & three children, including an 8-month-old child in Jiribam dist by #Kukiterrorists. They also attacked the house of MLA S Nishikant pic.twitter.com/kF4yVujBJn
— NEWSBREAK 🗞️ Sunil Thongam (@northeastnewsa) November 16, 2024
ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడంతోపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు అధికారులు. కాగా, మణిపూర్లో శాంతిభద్రతలను పునరుద్ధరించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రతా బలగాలను ఆదేశించింది. జిరిబామ్ జిల్లా నుంచి సాయుధ మిలిటెంట్లు మహిళలు, పిల్లలతో సహా ఆరుగురు పౌరులను అపహరించి చంపినట్లు నివేదికలను అనుసరించి ఈ ఆదేశాలు జారీ చేసింది. హత్యకు గురైన వారి శరీరాలపై తీవ్రమైన గాయాలు ఉండటం గమనార్హం. ఇద్దరి తలలను వేరిచేసి హత్య చేశారు కుకీ ఉగ్రవాదులు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications