వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోల బీభత్సం: ఉద్యోగి గొంతుకోసి, ఐదు వాహనాలకు నిప్పు
ఓ ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేశారు. రహదారి పనులను పర్యవేక్షిస్తున్న సూపర్ వైజర్ మెడను దారుణంగా హత్య చేశారు. ఆయన్ను పోలీసుల ఇన్ ఫార్మర్గా ఆరోపిస్తూ, అక్కడికక్కడ ప్రజా కోర్టు నిర్వహించి, తీర్పిచ్చి, ఆపై
కోరాపుట్: ఒడిశాలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. కొరాపుట్ జిల్లా సిమిలిగూడ సమితి పరిధిలోని బిస్తర్కోట వద్ద రహదారి నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు శుక్రవారం అర్థరాత్రి 5 వాహనాలను దగ్దం చేశారు.
ఓ ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేశారు. రహదారి పనులను పర్యవేక్షిస్తున్న సూపర్ వైజర్ మెడను దారుణంగా హత్య చేశారు. ఆయన్ను పోలీసుల ఇన్ ఫార్మర్గా ఆరోపిస్తూ, అక్కడికక్కడ ప్రజా కోర్టు నిర్వహించి, తీర్పిచ్చి, ఆపై నిర్దయగా గొంతు కోసి చంపారు.
ఆపై రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఐదు వాహనాలకు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న కూంబింగ్ దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. కాగా, రెండు వారాల క్రితం తమకు జరిగిన అపార నష్టానికి ఏ విధంగానైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న మావోయిస్టులు తమ ప్రభావిత ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తున్నారు.
English summary
Maoists killed a employee in odisha.
Story first published: Saturday, November 19, 2016, 9:42 [IST]