వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్కెట్లో మంటలు: కాలిన బస్సు, 5గురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

సూరత్/ నాగపూర్: గుజరాత్‌లోని సూరత్ టెక్స్‌టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సహారా దర్వాజా ప్రాంతంలోని ఆర్కిట్ కాంప్లెక్స్‌లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పడానికి పది ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగాయి. ప్రాణాపాయం సంభవించినట్లు సమాచారం లేదు.

గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్థులో ప్రారంభమైన మంటలు 17 అంతస్థుల భవనం అంతటా వ్యాపించాయి. ఈ భవనంలో వందకు పైగా కార్యాలయాలు, గోడౌన్లు ఉన్నాయి.

Massive fire breaks out at textile market in Gujarat

మహారాష్ట్రలో ఓ బస్సులో మంటలు లేచాయి. దీంతో ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. నాగపూర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో గల తెలగావ్ వద్ద గురువారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. నాగపూర్ నుంచి జల్గావ్ వెళ్తున్న బస్సులో మంటలు లేచాయి. ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు.

బస్సు నాగపూర్‌లోని బాబా ట్రావెల్స్‌కు సంబంధించింది. తెల్లవారు జామును ప్రయాణికులంతా నిద్రలో జోగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. బస్సులో 30 మంది దాకా ప్రయాణికులున్నారు. స్థానికుల సహాయంతో పోలీసులు ప్రయాణికులను రక్షించి నాగపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. వార్ధా జిల్లాలోని తెలగావ్ జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు.

English summary
A massive fire breaks out in Surat at a textile industry in Gujarat. A fire breaks out at the Aarkit complex of Sahara Darwaja area. 10 fire-fighters have been rushed to the scene. No casualties have been reported yet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X