మీరట్ లో భారీ అగ్నిప్రమాదం: కాలి బూడిదైన 200ఇళ్లు..
మీరట్: మీరట్ లోని లిసారి గేట్ పరిధిలో ఉన్న ఆషియానా కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 200ఇళ్లు కాలి బూడిదయ్యాయి. దీంతో బతుకుదెరువు కోసం వచ్చిన వందలాది ప్రజలు నిరాశ్రయులుగా మిగిలిపోయారు.
తెల్లవారుజామున 3.35గం.కు పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో.. దాదాపు 15 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. 7గంటల తర్వాత కానీ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. గడిచిన నెలన్నర రోజుల్లో ఇది ఈ ప్రాంతంలో ఇది రెండో అగ్ని ప్రమాదం కావడం గమనార్హం. అంతకుముందు షాట్ సర్క్యూట్ కారణంగా మరో 100ఇళ్లు కాలి బూడిదయ్యాయి.

ఆ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే తాజాగా ఈ అగ్నిప్రమాదం సంభవించింది. గతంలో కాలిపోయిన ఇళ్లు ఈ ప్రమాదంలో మరోసారి తగలబడ్డాయి. అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications