MBA Student: ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు తీసి ఫ్రెండ్స్ బ్లాక్ మెయిల్, లక్షలు లాగేశారు, చివరికి !
న్యూఢిల్లీ: ప్రముఖ కాలేజ్ లో ఎంబీఏ చదువుతున్న విద్యార్థి ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లివస్తున్నాడు. ఉదయం కాలేజ్ కు వెలుతున్న విద్యార్థి సాయంత్రం ఇంటికి వెళ్లేవాడు. ఒక్కోసారి రాత్రి లేటుగా ఇంటికి వెలుతున్న విద్యార్థి కాలేజ్ లో స్పెషల్ క్లాసులు ఉన్నాయని, స్నేహితులతో కలిసి హెటల్ కు వెళ్లి భోజనం చేసి రావడంతో లేటు అయ్యిందని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పేవాడు. కొంతకాలం నుంచి విద్యార్థి ఎక్కువగా కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా, సైలెంట్ గా ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు ఏమి జరిగింది?, ఎందుకు అలా ఉన్నావు అంటూ ప్రశ్నించిన ఆ విద్యార్థి మౌనంగా ఉండిపోతున్నాడు. ఇదే సమయంలో స్నేహితులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. సాటి స్నేహితులు అతను, అతని గర్ల్ ఫ్రెండ్ తో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి ఇప్పటికే లక్షల రూపాయలు లాగేశారని, ఇంకా టార్చర్ ఎక్కువ కావడంతో ఆత్మహత్యాయత్నం చేశాడని విద్యార్థి మామ పోలీసు కేసు పెట్టాడు.

ఎంబీఏ చదువుతున్న విద్యార్థి
ఢిల్లీ నైతురి ప్రాంతంలో 26 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. ప్రముఖ కాలేజ్ లో ఎంబీఏ చదువుతున్న విద్యార్థి ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లివస్తున్నాడు. కాలేజ్ లో చదువుతున్న యువకుడికి అతని ఇంట్లో బైక్ కూడా తీసిచ్చారు. బైక్ లో కాలేజ్ కు వెళ్లి వస్తున్న అతను అతని స్నేహితులతో హ్యాపీగా ఉండేవాడని తెలిసింది.

రాత్రి లేటుగా ఇంటికి వెళ్లేవాడు
ఉదయం కాలేజ్ కు వెలుతున్న విద్యార్థి సాయంత్రం ఇంటికి వెళ్లేవాడు. ఒక్కోసారి రాత్రి లేటుగా ఇంటికి వెలుతున్న విద్యార్థి కాలేజ్ లో స్పెషల్ క్లాసులు ఉన్నాయని, స్నేహితులతో కలిసి హెటల్ కు వెళ్లి భోజనం చేసి రావడంతో లేటు అయ్యిందని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పేవాడు. లేటుగా ఇంటికి వెళ్లిన సమయంలో ఆ యువకుడు ఏదో ఒక స్టోరీ చెప్పి ఇంట్లో తప్పించుకునేవాడు.

కుప్పకూలిపోయాడు
కొంతకాలం నుంచి విద్యార్థి ఎక్కువగా కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా, సైలెంట్ గా ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు ఏమి జరిగింది?, ఎందుకు అలా ఉన్నావు అంటూ ప్రశ్నించిన ఆ విద్యార్థి మౌనంగా ఉండిపోతున్నాడు. ఇంటికి వెళ్లిన కాలేజ్ విద్యార్థి తరువాత నిద్రమాత్రలు ఎక్కువగా మింగేసి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపాస్మరకస్థితిలో పడి ఉన్న విద్యార్థిని గుర్తించిన అతని కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

బ్లాక్ మెయిల్ చేసి రూ. 2 లక్షలు లాగేశారు
స్నేహితులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. సాటి స్నేహితులు అతను, అతని గర్ల్ ఫ్రెండ్ తో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి ఇప్పటికే లక్షల రూపాయలు లాగేశారని, ఇంకా టార్చర్ ఎక్కువ కావడంతో ఆత్మహత్యాయత్నం చేశాడని విద్యార్థి మామ పోలీసు కేసు పెట్టాడని విచారణ చేస్తున్న పోలీసు అధికారి గౌరవ్ శర్మా ఆయన్ను కలిసిన మీడియాకు చెప్పారు. గర్ల్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో 26 ఏళ్ల స్నేహితుడు సీక్రేట్ గా ఫోటోలు, వీడియోలు తీసి ఇప్పటి వరకు రూ. 2 లక్షలు లాక్కొన్నాడని, ఇంకా డబ్బులు ఇవ్వాలని టార్చర్ చెయ్యడంతో మా అబ్బాయి ఆత్మహత్యాయత్నం చేశాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications