Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

MCD polls: 50 శాతం పోలింగ్ నమోదు, బరిలో 1349 మంది, కాంగ్రెస్ చీఫ్ ఓటు గల్లంతు

న్యూఢిల్లీ: మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికలు ముగిశాయి. ఆదివారం నాడు 1,349 మంది అభ్యర్థుల భవితవ్యం ఖరారైంది. ఢిల్లీలోని మొత్తం 250 వార్డుల ఓటర్లలో దాదాపు 50% మంది ఓటు వేశారు. చాలా ఓటింగ్ బూత్‌లు సాయంత్రం 5:30 గంటలకు ముందు వచ్చిన ఓటర్ల నుంచి ఓట్లను స్వీకరిస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. బీజేపీని గద్దె దించాలని ప్రయత్నిస్తుండగా, కాషాయ పార్టీ పౌర సంఘంలో వరుసగా నాలుగోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది. 2015 నుంచి దేశ రాజధానిలో పార్లమెంటరీ, అసెంబ్లీ, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వరుసగా పరాజయం పాలైన కాంగ్రెస్ ఈసారి బలమైన ప్రదర్శనతో తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంది.

పౌర సంస్థల ఎన్నికల ఓటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:30 గంటలకు ముగిసింది

13 రోజుల విస్తృత ప్రచారం తర్వాత డిసెంబర్ 4న 250 ఎంసీడీ వార్డులకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించామని బీజేపీ నాయకులు ప్రకటించారు. అవినీతి ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ దాని కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించాయి.

 MCD polls: Polling Ends With 50% Voter Turnout, Delhi Congress Chief Finds Name Missing From Voters List

కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ నాయకులు కూడా బీజేపీపై అదే స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. 15 సంవత్సరాలుగా చేసేందేమీ లేదని, అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు.

కాగా, ఈ సంవత్సరం ప్రారంభంలో, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం జాతీయ రాజధానిలోని మూడు కార్పొరేషన్లను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో విలీనం చేసింది. దీంతోపాటు వార్డుల సంఖ్యను 272 నుంచి 250కి తగ్గించింది.

మూడు ప్రధాన పార్టీలు మొత్తం 250 వార్డుల్లో 1,349 మంది అభ్యర్థులను బరిలోకి దించాయి. మొత్తం 1.45 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

2017 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన 270 వార్డులకు గాను 181 వార్డులను గెలుచుకుని ఆప్, కాంగ్రెస్‌లను బీజేపీ సులభంగా ఓడించింది. ఆప్ తన మొదటి పౌర సంస్థల ఎన్నికల్లో 48 వార్డులను గెలుచుకోగా, కాంగ్రెస్ 30 గెలుచుకుంది.

బహుజన్ సమాజ్ పార్టీకి 132 మంది అభ్యర్థులు ఉండగా, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 15 వార్డుల్లో పోటీ చేసింది.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 26 వార్డుల్లో అభ్యర్థులు ఉండగా, జనతాదళ్ (యునైటెడ్)కి 22 మంది అభ్యర్థులు ఉన్నారు. డిసెంబర్ 7న ఫలితాలు వెల్లడికానున్నాయి.

నా ఓటు గల్లంతంటూ కాంగ్రెస్ చీఫ్ ఆవేదన

ఓటరు జాబితాలో కానీ, తొలగించిన జాబితాలో కానీ నా పేరు లేదు.. నా మాత్రం భార్య ఓటు వేసింది.. అధికారులు పరిశీలిస్తున్నారు.. అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+