ఉగ్రవాది యాసిన్ మాలిక్ తనను కిడ్నాప్ చేసినట్లు గుర్తించిన మెహబూబా ముఫ్తీ సోదరి రుబయ్యా
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ సోదరి రుబయ్యా సయీద్.. తమను జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్, మరో ముగ్గురు అపహరించినట్లు గుర్తించారు. రుబయ్యా సయీద్ డిసెంబర్ 8, 1989న లాల్ డెడ్ హాస్పిటల్ సమీపంలో కిడ్నాప్ చేయబడ్డారు. కేంద్రంలోని బీజేపీ మద్దతుతో ఏర్పడిన అప్పటి విపి సింగ్ ప్రభుత్వం.. బదులుగా ఐదుగురు ఉగ్రవాదులను విడుదల చేసిన తర్వాత ఐదు రోజుల తర్వాత రుబయ్యా విడుదలైంది.
శుక్రవారం, రుబయ్యా సయీద్ ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కోర్టు ముందు హాజరయ్యారు. 1990 ప్రారంభంలో సిబిఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాలని రుబయ్యా సయీద్ను కోరడం ఇదే మొదటిసారి.
కోర్టులో ఏం జరిగింది?
కోర్టులో.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టుకు హాజరైన యాసిన్ మాలిక్ను కిడ్నాపర్గా రుబయ్య గుర్తించారు.
"ఈ వ్యక్తి, అతని పేరు యాసిన్ మాలిక్. నేను వారి ఆజ్ఞను పాటించడానికి నిరాకరిస్తే మినీబస్సు నుంచి బయటకు తోసేస్తామని నన్ను బెదిరించిన వ్యక్తి" అని రుబయ్య న్యాయమూర్తికి తెలిపారు.
కోర్టులో ప్రదర్శించిన చిత్రాల ద్వారా యాసిన్ మాలిక్ను కూడా ఆమె గుర్తించింది.
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో ఇటీవల జీవిత ఖైదు పడిన యాసిన్ మాలిక్.. ఈ కేసులో 10 మంది నిందితుల్లో ఉన్నారు. ఈ కేసులో సీబీఐ అభియోగాలు మోపిన వారిలో అలీ మహ్మద్ మీర్, మహ్మద్ జమాన్ మీర్, ఇక్బాల్ అహ్మద్ గాండ్రూ, జావేద్ అహ్మద్ మీర్, మహ్మద్ రఫీక్ పహ్లూ, మంజూర్ అహ్మద్ సోఫీ, వజాహత్ బషీర్, మెహ్రాజ్-ఉద్-దిన్ షేక్, షోకత్ అహ్మద్ బక్షి ఉన్నారు.