అమిత్ షా కు కరోనా నెగటివ్ వట్టిదే - తాజాగా టెస్టు చేయలేదన్న హోం శాఖ - బీజేపీ ఎంపీపై విమర్శలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం తలెత్తింది. కరోనా మహమ్మారి బారిన పడి గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనకు తాజా టెస్టుల్లో నెగటివ్ అని తేలిందంటూ వార్తలు రావడంతో బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఊరట చెందారు. కానీ నిమిషాల వ్యవధిలోనే సదరు వార్త ఫేక్ అంటూ సాక్ష్యాత్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖనే క్లారిటీ ఇచ్చింది.

అమిత్ షాకు కరోనా నెగటివ్ అని నిర్ధారణ అయిందంటూ బీజేపీ ఎంపీ, ఢిల్లీ శాఖ మాజీ చీఫ్ మనోజ్ తివారీ చేసిన ట్వీట్ వల్లే మంత్రి ఆరోగ్యంపై గందరగోళం ఏర్పడింది. ''గడిచిన వారం రోజులుగా మంత్రి గారికి ఎలాంటి టెస్టులు చేయలేదు. ఆయన కరోనా నెగటివ్ గా తేలారంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఆస్పత్రి వర్గాలుగానీ, అధికారులుగానీ దీన్ని ధృవీకరించడంలేదు''అని హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

MHA says No new Covid-19 test on Amit Shah, bjp mp manoj Tiwari deletes tweet

అత్యుత్సాహానికి పోయి తప్పుడు ట్వీట్ చేసిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీపై నెటిజన్లు విమర్శలు కురిపించారు. అమిత్ షాకు తాజాగా టెస్టులేవీ చేయలేదన్న హోం శాఖ ప్రకటన తర్వాత ఎంపీ తివారీ తన ట్వీట్ ను డిలిట్ చేశారు.

కరోనా లక్షణాలతో అమిత్ షా ఈనెల 2న గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆరుగురు కేంద్ర మంత్రులు సైతం పాజిటివ్ గా తేలి వివిధ ఆస్పత్రుల్లో చేరారు. ఆదివారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 21.56లక్షలకు, మరణాలు దాదాపు 44వేలకు చేరుకున్నాయి.

Recommended Video

    Amit Shah Tests Coronavirus Positive ఆస్పత్రిలో చేరుతున్నా అని అమిత్ షా ట్వీట్ ! || Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+