మైనర్ల ఘాతుకం: విద్యార్థినిపై గ్యాంగ్రేప్, ఆన్లైన్లో వీడియో పెట్టారు!
ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లా శరణకుల్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లా శరణకుల్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బాధితురాలిని బెదరింపులకు పాల్పడ్డారు.
ఫిబ్రవరిలో జరిగిన ఈ దారుణ ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఆ దుర్మార్గులు అత్యాచారం చేసిన దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో ఉంచడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆదివారం రాత్రి బాలిక తల్లిదండ్రులు, గ్రామస్థులు శరణకుల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే, ఘటన అనంతరం విషయం బయటపడితే పరువుపోతుందని కుటుంబసభ్యులు భయపడి ఫిర్యాదు చేయలేదు. కానీ, ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో రావడంతో గ్రామస్థులు నిందితుల్లో ఓ యువకుడిని పట్టుకుని గ్రామసభ నిర్వహించారు.
బాధితురాలిని వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. అందుకు యువకుడు నిరాకరించడంతో ఆదివారం రాత్రి బాలిక కుటుంబసభ్యులు, గ్రామపెద్దలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.