సీఎం సిద్దూ గ్రేట్, బీజేపీ అంటే ఏమిటో ?, లోక్ సభ ఎన్నికలు, గాలి జనార్దన్ రెడ్డి !
బెంగళూరు/బళ్లారి: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి, కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మరోసారి తెరమీదకు వచ్చారు. సిద్దరామయ్య, డీకే. శివకుమార్ ప్రమాణస్వీకారం రోజు వేదిక మీద ప్రత్యక్షం అయిన గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇటు బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చారు. తరువాత సొంత నియోజక వర్గంలో గాలి జనార్దన్ రెడ్డి మకాం వేశారు.
కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని గంగావతి నియోజక వర్గం నుంచి కేఆర్ పీపీ నుంచి (గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీ) పోటీ చేసిన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న గాలి జనార్దన్ రెడ్డి తరువాత కమల పార్టీ నాయకులకు దూరంగా ఉంటున్నారు.

గురువారం గంగావతిలో గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య చాలా చక్కగా పని చేస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తాను ఇటీవల సీఎం సిద్దరామయ్యతో చర్చించానని, ఆయన తాను చెప్పిన మాటలను ఎంతో ఓపిగా విన్నారని కేఆర్ పీపీ ఎమ్మెల్యే, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
గంగావతి అభివృద్ధి కోసం సీఎం సిద్ధరామయ్యను కలిశాను. ఈ చర్చల సందర్బంగా ఆయన సానుకూలంగా స్పందించారని, గంగావతి నియోజకవర్గం అభివృద్ధికి, అంజనాద్రి అభివృద్ధికి గ్రాంట్ ఇచ్చి సహకరిస్తానని సీఎం సిద్ధరామయ్య తనకు హామీ ఇచ్చారు. మరో రెండు నెలల్లో అంజనాద్రి అభివృద్ధికి శ్రీకారం చుడతామని కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.

సిద్ధరామయ్య 14 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు, ఆయనకు ఆర్థిక శాఖ మీద మంచి పట్టు, అనుభవం ఉంది, ఉచిత గ్యారంటీ పథకాలకు సంబంధించిన నిధులు ఏకీకృతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు, ఉచిత హామీ పథకాలతో పాటు అభివృద్ధికి గ్రాంట్లు ఇస్తామన్నారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ నుంచి 7 నుంచి 8 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు తాను సన్నాహాలు చేస్తున్నామని, త్వరలో పూర్తి సమాచారం ఇస్తామని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
మళ్లీ తాను బీజేపీలోకి వెళ్లనని, ఎన్డీయే కూటమిలో చేరే ప్రసక్తే లేదని, సొంత కేఆర్ పీపీ నుంచే తాను రాజకీయంగా అభివృద్ధి చెందుతానని గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూలకు కేఎంఎఫ్ నుంచి నెయ్యి సరఫరా చెయ్యాలని, కేఎంఎఫ్ కు ఆ పని చేసే శక్తి ఉందని, అయితే ఇక్కడికి సరఫరా ఆపకుండా ఉండాల్సిందని కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద తాను బీజేపీలో చేరే ప్రసక్తేలేదని మరోసారి గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications