నేడు సాయంత్రం సమావేశం కానున్న మోడీ క్యాబినెట్.. శాఖలు కేటాయించే అవకాశం
రెండవసారీ అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ ప్రభుత్వం...శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు తొలి క్యాబినెట్ సమావేశం జరగనుంది... మోడీ మంత్రివర్గంలో 58 మంది సభ్యులు ఉండగా 24మంది సభ్యులతో క్యాబినెట్ కొలువుదీరింది. కాగా వీరందరితో సాయంత్రం మోడీ అధ్యక్షతన తొలి క్యాబినెట్ సమావేశం జరగనుంది.
అయితే క్యాబినెట్లో ఏ అంశాలు చర్చిస్తారనేది స్పష్టత రాలేదు. ముఖ్యంగా రానున్న కొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉండడంతో పార్లెమెంట్ సమావేశ తేదీలపై చర్చించనున్నారు. మరోవైపు ఆయా మంత్రులకు శాఖలు కేటాయిస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటకి పలు శాఖలకు సంబంధించి పేర్లు ఖారరైప్పటికి వాటిని అధికారికంగా వెలువరించనున్నట్టు తెలుస్తోంది.వీటితో ఇతర మంత్రులకు శాఖలను కేటాయించనున్నారు.
కాగా పలు శాఖలపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో మొదటిసారి మంత్రివర్గంలో చేరుతున్న బీజేపీ పార్టీ చీఫ్ అమిత్ షాకు ఆర్ధిక శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.వీరితోపాటు, రాజ్నాథ్ సింగ్ ,నిర్మలా సీతారామన్లకు తిరిగి పాత శాఖలనే కేటాయించున్నారు.