మోదీసర్కారు బంపర్ ఆఫర్: నిముషం రీల్స్ పంపి రివార్డ్స్ గెలుచుకోండి.. ఆగస్ట్ 1వరకు మాత్రమే!
దేశంలోని ఔత్సాహికులకు మోదీ సర్కారు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దేశంలో డిజిటల్ ఇండియా ప్రారంభించి 10సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రత్యేకమైన పోటీని నిర్వహిస్తోంది. ఏ డికేడ్ ఆఫ్ డిజిటల్ ఇండియా రీల్ కాంటెస్ట్ ను ప్రారంభించిన మోడీ సర్కార్ ఈ పోటీ ద్వారా డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చిందో రీల్స్ ద్వారా తెలియజేయవచ్చునని, గెలుపొందిన వారికి నగదుబహుమతులు కూడా అందజేస్తామని పేర్కొంది.
జూలై 1న ప్రారంభమై ఆగస్టు 1 వరకు డిజిటల్ ఇండియా కాంటెస్ట్
ఈ పోటీ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 1 వరకు కొనసాగుతుంది. ఈలోపు ఎవరైనా సరే ఈ కాంటెస్ట్ లో పాల్గొనవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2015 జూలై 1న డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ సేవలను ఆన్లైన్లోకి తీసుకురావడం, డిజిటల్ విద్యను అందించడం, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం.

డిజిటల్ ఇండియా పై వీడియో
ఈ పదేళ్లలో డిజిటల్ ఇండియా దేశంలో ప్రజల జీవితాలను ఎలా మార్చిందో మీ అనుభవాలను రీల్స్ రూపంలో పంచుకోవడం ద్వారా సెలెబ్రేట్ చేసుకోవచ్చునని పేర్కొంది. ఈ పోటీలో పాల్గొనేవారు ఒక నిమిషం నిడివి గల వీడియోను రూపొందించి పంపించాలి. ఆ వీడియోలో డిజిటల్ ఇండియా మీ జీవితంపై చూపిన ప్రభావాన్ని చాలా సృజనాత్మకంగా తెలియజేయాలి. వీడియో నిడివి కనీసం ఒక నిమిషం ఉండాలి.
పోటీలో గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నగదు బహుమతులు
వీడియో కచ్చితంగా మీ సొంతంగా రూపొందించినదై ఉండాలి. ఇదివరకు ఏ సోషల్ మీడియాలోనూ అప్లోడ్ చేసి ఉండకూడదు. హిందీ, ఇంగ్లీష్ లేదా ఇతర స్థానిక భాషల్లో వీడియోను రూపొందించవచ్చు. వీడియో పోర్ట్రెయిట్ మోడ్లో MP4 ఫార్మాట్లో ఉండాలని పేర్కొంది. ఈ పోటీలో గెలుపొందిన వారికి కేంద్ర ప్రభుత్వం నగదు బహుమతులు కూడా అందజేస్తుంది.
నగదు బహుమతులు ఇలా
మొదటి 10 మంది విజేతలకు రూ. 15,000, ఆ తర్వాతి 25 మందికి రూ. 10,000, ఆ తర్వాత 50 మందికి రూ. 5,000 చొప్పున బహుమతులు ఇస్తుంది. ఈ పోటీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ mygov.in లో చూడవచ్చు. ఇది డిజిటల్ ఇండియా సాధించిన విజయాలను ప్రజలతో పంచుకునే అవకాశం కనుక, మీలోని సృజనాత్మకతను వెలికి తీసి, ఈ పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని మిస్ చేసుకోకండి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications