వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ రాకతో కాషాయమయమైన వారణాసి...ఎటు చూసినా నమో నినాదాలే..!

|
Google Oneindia TeluguNews

ఏప్రిల్ 26న నామినేషన్ వేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ నుంచి వారణాసిలోని బబతాపూర్ విమానాశ్రయంకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బెనారస్ హిందూ యూనివర్శిటీకి చేరుకున్నారు. బెనారస్ హిందూ యూనివర్శిటీ వ్యవస్థాపకులు మదర్ మోహన్ మాలవియా విగ్రహానికి నివాళులు అర్పించారు. ఇక వారణాసిలో మోడీకి ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఉత్సాహంతో ఎదురుచూశారు. అక్కడి నుంచి కారులో ప్రధాని మోడీ లంకకు బయలుదేరి వెళ్లారు.

లంకనుంచి ఆయన రోడ్ షో ప్రారంభం అవుతుంది. దాదాపు ఏడు కిలోమీటర్ల మేరా ప్రధాని మోడీ రోడ్ షో ఉంటుంది. మోడీ రాకతో వారణాసిలోని వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. ఎటు చూసిన మోడీ నినాదాలతో వీధులు మారిమ్రోగిపోతున్నాయి. మోడీ రోడ్ షోలో దాదాపు ఆరు లక్షల మంది ప్రజలు పాల్గొననున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోడ్ షో దాదాపు నాలుగు గంటల పాటు సాగనుంది.

Modi in Varanasi: NaMo chants heard in every corner of the temple town

మోడీ రాకతో వారణాసిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యూపీ పోలీస్ యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఇక రోడ్ షో అనంతరం మోడీ పవిత్ర గంగానదికి హారతి పడతారు. అనంతరం ఈ రాత్రికి వారణాసిలోని ఓ హోటల్‌లో బసచేసి శుక్రవారం ఆయన తన నామినేషన్‌ను దాఖలు చేస్తారు.

English summary
Prime Minister Narendra Modi has arrived in Varanasi. Varanasi is all welcomed its beloved MP Narendra Modi and country's Prime Minister. He will be filing his nomination for the Lok Sabha elections for a second time from Varanasi constituency on April 26. PM Modi will also perform Ganga aarti at Varanasi ghat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X