మోడీ సూటు డబ్బుతో గంగా శుద్ధి అవుతుందా?: రాజ్ థాకరే ప్రశ్న
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా తన పేరు ఉన్న సూటు పైన విమర్శలు రావడం, వివాదాస్పదం కావడంతోనే దానిని వేలం వేశారని వ్యాఖ్యానించారు.
అంత విలువ కలిగిన సూటును మోడీ వేసుకోవడంపై విమర్శలు వచ్చాయని, అందుకే దానిని వేలం వేశారన్నారు. ఆయన పార్టీకి చెందిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

ప్రధాని మోడీ సూటును వేలం వేస్తే గంగా నది శుద్ధి అవుతుందా అని ప్రశ్నించారు. టోల్ పేలో పారదర్శకత వచ్చే వరకు ప్రజలు దానిని చెల్లించవద్దని సూచించారు. ఇప్పుడు ఏ ఇతర మహారాష్ట్ర పార్టీ కూడా రోడ్డు టోల్ విషయమై మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం టోల్ ఫ్రీని రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిందని రాజ్ థాకరే అన్నారు. ఇప్పుడు ఆ పార్టీ దీని గురించి మాట్లాడటం లేదన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ సూటు వేలం వేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని గంగాశుద్ధికి ఉపయోగిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications